Published : Apr 19, 2026, 06:23 PM ISTUpdated : Apr 19, 2026, 06:25 PM IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సర్జరీ జరగడంతో టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి వారు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు పెట్టారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శనివారం రోజు సర్జరీ జరిగింది. కొంత కాలంగా పవన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూ, నటుడిగా సినిమాల్లో సైతం నటిస్తున్నారు. ఇటీవల పవన్ కి అస్వస్థత ఎక్కువ కావడంతో శనివారం రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది.
25
శ్వాస పరమైన ఇబ్బంది
అయితే అది దేనికి సంబంధించిన ఆపరేషన్ అనే వివరాలని జనసేన పార్టీ కానీ, పవన్ సన్నిహితులు కానీ బయట పెట్టలేదు. దీనితో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. అయితే పవన్ సర్జరీకి సంబంధించిన వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి కొంత కాలంగా శ్వాస పరమైన ఇబ్బంది ఉంది. అది సైనసైటిస్ వల్ల తలెత్తిన ఇబ్బంది అని వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేసి నిర్ధారించారు.
35
10 రోజుల పాటు విశ్రాంతి
ముక్కుకి సర్జరీ అవసరం అని వైద్యులు చెప్పడంతో పవన్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ అనంతరం పవన్ ఇంటికి వెళ్లారు. ఇంట్లోనే 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని పవన్ కి వైద్యులు సూచించారు. పవన్ కి సర్జరీ జరగడంతో టాలీవుడ్ సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ లో.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలి అని ప్రార్థిస్తున్నా. వీలైనంత త్వరగా ఆయన ఆరోగ్యంతో పబ్లిక్ లైఫ్ లోకి తిరిగి రావాలి అని పోస్ట్ చేశారు.
చిరంజీవి ట్వీట్ చేస్తూ.. కళ్యాణ్ బాబుకి విజయవంతంగా ఆపరేషన్ పూర్తయింది. ఆరోగ్యం నిలకడగా ఉంది. రికవరీ అవుతున్నాడు. డాక్టర్లు చెప్పిన దానిప్రకారం కళ్యాణ్ బాబు వారంలో పూర్తిగా కోలుకుంటాడు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ప్రేమ అభిమానులకు ధన్యవాదాలు అని అన్నారు.
55
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని
అదే విధంగా రాంచరణ్, అల్లు అర్జున్ లు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ లో పోస్ట్ లు పెట్టారు. వీరితో పాటు మరికొందరు సెలెబ్రిటీలు, దర్శకులు, నటులు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు చేస్తున్నారు.