ఇక, టీడీ జనార్దన్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానాలను అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు జూనియర్ ఎన్టీఆర్తో, దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి కళ్యాణ చక్రవర్తిలను కలిసి ఆహ్వానం పలికారు. నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానం పలుకుతున్న టీడీ జనార్దన్ వెంట నందమూరి రామకృష్ణ కూడా ఉన్నారు.