స్టార్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోపం వచ్చింది. వచ్చిందే తడవుగా వార్నింగ్ కూడా ఇచ్చాడు నెటిజన్లకు. స్టార్ హీరోలకు .. భారీ బడ్జెట్ సినిమాలకు కొరియోగ్రఫర్ గా పనిచ చేసిన జానీ మాస్టార్ .. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ,కన్నడ సినిమాలకు కూడా కొరియోగ్రఫర్ గా పనిచేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జానీ మాస్టర్ .. కోపంతో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో జానీ మాస్టర్ ఈటీవీలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఢీ షో కి జడ్జిగా వ్యవహరించారు. ఢీ షోకి ఆయనకు చాలా దగ్గర అనుబంధం ఉంది. అయితే ఢీ షో ఎంత సక్సెస్ అయ్యిందో.. అంత విమర్షలు కూడా ఫేస్ చేసింది.. చేస్తోంది కూడా.
ఈ షోపై సోషల్ మీడియాలో ఎప్పుడూ.. నెగటివ్ ప్రచారం జరుగుతూనే ఉంటుంది . షోలో డాన్స్ తప్ప అన్నీ ఉంటాయని.. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ డాన్స్ చేయడం మానేసి సర్కస్ చేస్తుంటారని.. ఈమధ్య మితిమీరిన రొమాన్స్ చేస్తున్నారని... అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
ఈ కామెంట్ల విషయంలో జానీ మాస్టర్ కు కోపం వచ్చింది.. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ విషయంలో స్పందించారు. అందరూ రాసుకోండి.. ఇంకోసారి ఢీ షో గురించి ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే.. అస్సలకి ఊరుకోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో జానీ మాస్టర్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల అవుతున్నాయి.
జానీ మాస్టర్ అన్న మాటలు నెటిజన్లకు కూడా కోపం తెప్పించాయి. దాంతో ఆయన్ని కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కొందరు ట్రోల్ చేస్తున్నారు.ఢీ షో కి నీకు ఏంటి లింకు .. అసలునీకేంటి సంబంధం .. .ఆ షోని అంటే నీకేంటి నొప్పి.. అంటూ బూతులు తిడుతున్నారు. మరి ఈ కామెంట్స్ జానీ మాస్టర్ కంట పడ్డాయా.. పడితే ఆయన ఎమని స్పందిస్తారో చూడాలి మరి.