సహజనటి జయసుధ గురించి పరిచయం అవసరం లేదు. 80 దశకంలో జయసుధ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించింది. ప్రస్తుతం జయసుధ టాలీవుడ్ లో తల్లి పాత్రలలో రాణిస్తున్నారు. తల్లి పాత్రలతో కూడా ఆమె తనదైన ముద్ర వేస్తున్నారు. బొమ్మరిల్లు, పరుగు, శతమానం భవతి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలే అందుకు నిదర్శనం.
ఇదిలా ఉండగా జయసుధ వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది. గతంలో జయసుధకి రెండు పెళ్లిళ్లు జరిగాయి. ప్రస్తుతం జయసుధ వయసు 64 ఏళ్ళు. ఈ వయసులో జయసుధ రహస్యంగా మూడో వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో ఎవరా వ్యక్తి.. పెళ్లి ఎప్పుడు జరిగింది అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఇటీవల జయసుధ వివిధ ఫంక్షన్స్ లో ఒక వ్యక్తితో కలసి హాజరు అవుతుండడంతో ఆమె పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. ఓ వ్యాపార వేత్తని జయసుధ వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు మూడో పెళ్లి జరిగింది అంటూ వస్తున్న వార్తలపై జయసుధ స్పందించారు. అది పూర్తిగా అసత్యం అని తేల్చేశారు.
తనతో పాటు ఉంటున్న ఆ వ్యక్తి గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. తనతో వెంట ఉంటుంది ఆ వ్యక్తి తన స్నేహితుడు అని జయసుధ తెలిపింది. అమెరికా నుంచి వచ్చారట. ఒక సినిమా కాంబినేషన్ కోసం తామిద్దరం మీట్ అయినట్లు జయసుధ పేర్కొంది. అతని పేరు పెలిపే. బయోపిక్ బేస్డ్ చిత్రాలు చేస్తుంటారు. అయితే బయోపిక్ చిత్రాలని అతడు విభిన్నమైన యాంగిల్ లో చేస్తుంటారు.
నా బయోపిక్ చేస్తున్నారు. ఈ బయోపిక్ స్పిరిచ్యువల్ గా ఉంటుంది. నేను క్రిస్టియానిటికి ఎలా మారాను ? అంతకు ముందు నా లైఫ్ లో ఏం జరిగింది అనే అంశాలు ఉంటాయని జయసుధ అన్నారు. అంతకి మించి ఇంకేమి లేదు. అతడిని జయసుధ మూడో వివాహం చేసుకుంది అని వస్తున్నవార్తల పట్ల ఆమె నవ్వేసి ఊరుకున్నారు.
ఇదిలా ఉండగా గతంలో జయసుధ కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది. విభేదాలతో అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖ నటుడు జితేంద్ర కపూర్ బంధువు నితిన్ కపూర్ ని వివాహం చేసుకుంది. నితిన్ కపూర్ అనారోగ్య సమస్యల కారణంగా 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. వీరిద్దరికి ఒక కుమారుడు సంతానం.