అమ్మ శ్రీదేవి చివరి కోరిక తీర్చుతున్న జాన్వీ కపూర్.. అతిలోక సుందరి చివరి కోరిక ఏంటంటే..?

First Published Jul 17, 2024, 1:31 PM IST

ఇండియన్ లెజండరీ హీరోయిన్.. దివంగత శ్రీదేవి చివరి కోరిక ఏంటి..? అది తీర్చడానికి జాన్వీ కపూర్  ఏం చేస్తోంది..? తల్లి మాటను నిలబెట్టడానికి సౌత్ ప్లైట్ ఎక్కిందా..? 
 

తెలుగు తమిళ పరిశ్రమలతో పాటు.. బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా స్టార్ డమ్ ను చూసింది శ్రీదేవి. అలనాటి అందాల తార.. అతిలోక సుందరిగా వెలుగు వెలిగింది. ఇక  స్వర్గీయ శ్రీదేవి ముద్దుల పెద్దు కూతురు జాన్వీ కపూర్ కూడా తల్లి వారసత్వం తీసుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  అయితే బాలీవుడ్ లో కమర్షియల్ సినిమాల జోలికి వెళ్ళకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేసింది. బ్యూటీ. 

క్లీనింగ్ సిబ్బందిని అవమానించిన రోజా, దూరంగా ఉండాలంటూ సైగలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో విందు చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తుంది జాన్వీ కపూర్. బీ టౌన్ లో సినిమాలు మాత్రం చాలా పద్దతిగా ప్రయోగాత్మక మూవీస్ చేసింది. ఆమె సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వపోయినా.. నటిగామాత్రం మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈమధ్యే జాన్వీ కపూర్ సౌత్ ప్లైట్ ఎక్కింది. బాలీవుడ్ లో ఆర్ట్ మూవీస్ చేస్తూ వచ్చిన ఈబ్యూటీ.. సౌత్ లో మాత్రం పక్కా కమర్షియల్ జపం చేస్తోంది. 
 

జమున మీద పగబట్టిన ఎన్టీఆర్ ‌- ఏఎన్నార్, ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?

Latest Videos


తెలుగులో రెండు ప్రాజెక్ట్ లు చేస్తోంది జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది బ్యూటీ. ఈమూవీ ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.  సెప్టెంబర్ 27 న దేవరను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
 

10 ప్లాప్ లు అయినా తగ్గని స్టార్ హీరో.. సినిమాకు 100 కోట్లు పైనే వసూలు చేస్తున్న నటుడు ఎవరు...?

ఇక రామ్ చరణ్ సరసన కూడా ఓ మూవీ కమిట్ అయ్యింది. జాన్వీ. రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈసినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నాడు. త్వరలో సినిమా సెట్స్ మీదకువెళ్లే అవకాశం ఉంది. 

రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

Image: Getty Images

ఈక్రమంలో జాన్వీ కపూర్ విషయంలో ఆమె తల్లి.. దివంగత శ్రీదేవికి ఓ కోరిక ఉండేదట. అదే ఆమె చివరికోరిక కూడా అయ్యింది. శ్రీదేవి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ బ్రాక్ గ్రౌండ్ నుంచి వచ్చింది. ఆతరువాత బాలీవుడ్ ను ఏలింది. తన కూతురు మాత్రం బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. సౌత్ కు వెళ్ళి తన మాతృ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా రాణించాలని ఆమె కోరకుందట. దానికి తగ్గ ప్రయ్నాలు కూడా చేసిందట. అయితే అసలు జాన్వీ కపూర్ ఎంట్రీ చూడకుండానే ఆమె తిరిగి రాణి లోకాలకువెళ్ళిపోయింది. 
 

Actress Janhvi Kapoor, Sridevi,

శ్రీదేవికి తన కూతురు హిందీ సినిమాలతో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోయిన గా చూడాలని కోరకుంది. ఆకోరికను జాన్వీ కపూర్ ఇప్పుడు తీర్చుతోంది.  చిత్ర పరిశ్రమలో కూడా నటించి పాపులర్ హీరోయిన్ గా ఎదగాలని చాలా కోరకగా ఉండేదట. జాన్వీకపూర్ కూడా ఆ సమయం కోసం వేచి చూసి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ హీరోలతో టాలీవుడ్ ఎంట్రీని ప్లాన్ చేసుకుంది. అంతే కాదు ఈరెండు సినిమాలతో ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మారిపోబోతోంది. శ్రీదేవి కూతురు ఈరకంగా పెద్ద ప్లానే వేసింది. 

ఇవే కాదు అటు కోలీవుడ్ లో కూడా ఆమె ఎంట్రీ ఇస్తోందట. గతంలో సూర్య సరసన నటిస్తుంది అన్నారు. కాని ఆ సినిమా  ఆగిపోయిందని టాక్. దీంతో పాటు విజయ్‌ సేతుపతి సినిమాలో కూడా జాన్వీ నటించబోతున్నట్టు సమాచారం.జాన్వికపూర్ ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా ఒప్పుకుంది. హీరో నాని  సరసన ఓ చిత్రంలో నటించడానికి జాన్వీ అంగీరించింది అంటున్నారు. 
 

Janhvi Kapoor

నాని హీరోగా నటించిన దసరా వంటి మాస్ బ్లాక్‌బాస్టర్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకుడు. దసరా చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు జాన్వీ కపూర్ తెలుగులో మూడు సినిమాలలో హీరోయిన్ గా నటించబోతున్నదని తెలుస్తుంది. ఇలా శ్రీదేవి కోరిక జాన్వీ కపూర్ తీర్చబోతుంది. 

click me!