తాజాగా తన మనసులో మాట వెల్లడించింది. పెళ్లి చేసుకుని తిరుమలలో సెటిల్ అవుతానని చెప్పింది. గోవింద నామాన్ని స్మరించుకుంటూ బతికేస్తానని చెప్పింది. పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కనాలనుకుంటుందట. అంతేకాదు ప్రతి రోజు అరటి ఆకుల్లో భోజనం చేయాలని ఉందని చెప్పింది. గోవింద నామ స్మరణం చేసుకుంటూ తన భర్త లుంగీలో ఉంటే ఆయనకు ఆయిల్ మసాజ్ చేస్తూ, రొమాంటిక్ జీవితాన్ని గడపాలనుకుంటున్నట్టు తెలిపింది జాన్వీ కపూర్.
ఇలా తన మనసులో మాటని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే జాన్వీ కపూర్ ప్రస్తుతం ప్రేమలో ఉందట. ఆమె ఓ వ్యాపారవేత్త కొడుకు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు కలిసి చాలా సందర్భాల్లో మీడియాకి దొరికిపోయారు. ఆ మధ్య కలిసే తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఘాఢంగా నడుస్తుందని తెలుస్తుంది. దీంతో జాన్వీ కపూర్ మనసులో కోరిక ఉంది, పెళ్లి చేసుకోవడానికి ప్రియుడు ఉన్నాడు, ఇక మ్యారేజ్ చేసుకుని పిల్లలను కనడమే ఆలస్యం, తిరుమలలో సెటిల్ కావడమే ఆలస్యం అంటున్నారు నెటిజన్లు.
కెరీర్ పరంగా చూస్తే జాన్వీ పూర్ గతేడాది ఎన్టీఆర్తో `దేవర` చిత్రంలో నటించింది. ఈ మూవీ విశేష ఆదరణ పొందింది. దీనికి పార్ట్ 2 `దేవర 2` కూడా ఉంది. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. దీనికి కొరటాల శివ దర్శకుడు. దీంతోపాటు రామ్ చరణ్తో కలిసి `ఆర్సీ16`లో నటిస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ నెల 27 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందట.
read more: `స్పిరిట్` స్టోరీ బ్యాక్ డ్రాప్ లీక్.. ప్రభాస్ చేయబోయే ఫైట్ దానిపైనే ?
also read: ఎనర్జీ సీక్రెట్ ను బయటపెట్టిన జాన్వీ కపూర్, ఫేవరెట్ డ్రింక్ పై లెక్చర్ కూడా ఇస్తోంది.