ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జ్ఞానాంబ కుటుంబ సభ్యులందరూ కలిసి పూజారి దగ్గరకు వెళ్లి అర్చన చేయించమని అంటారు. అప్పుడు మల్లిక మాత్రం నా మాకు విడిగా చేయించమని అడగగా అదేంటమ్మా ఎప్పుడు కలిసి చేస్తారు కదా ఈసారి ఎందుకు విడిగా చేస్తున్నారు అని పూజారి అడుగుతారు. దానికి మల్లిక, జరిగిన విషయం ఏమిటంటే అని చెప్పేలోగా జానకి, మరేమీ లేదు పంతులు గారు మల్లిక కడుపుతో ఉన్నది కదా దానికోసం తన పుట్టబోయే బిడ్డ కోసం విడిగా చేస్తే బిడ్డకు మంచిది కదా అలాగే అఖిల్, జెస్సీ వాళ్ళకి కూడా విడిగానే చేయించండి అని అంటుంది.దానికి పూజారి గారు అలాగా అమ్మా నేను కంగారు పడ్డాను ఎందుకు ఇలా అడుగుతున్నారా అని, అని లోపలికి వెళ్లి అర్చన చేయిస్తాడు. అప్పుడు మల్లిక, పంతులుగారు జానకి చెప్పేది అబద్ధం అసలు విషయం ఏంటంటే అని చెప్పే లోగా జానకి గుడి గంటలు కొడుకు మల్లిక గొంతు ఎవరికి వినిపించకుండా చేస్తుంది.