ఈ లోగ జ్ఞానాంబా, ఏం చేస్తున్నావ్ జానకి? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? అని అంటుంది. తిను మొన్న నాకు అకాడమీలో పరిచయమైంది అత్తయ్య గారు నా ఫ్రెండ్ అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ,ఎదుటి మనిషి గురించి కొంచెం తెలుసుకొని పరిచయం చేసుకుంటే మంచిది పొగరికి బట్టలు వేసినట్టు ఉంటుంది ఈ పిల్ల. దీని గురించి నాకు మొన్నే తెలిసింది అని చెప్పి జానకిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది.అప్పుడు ఙ్ఞానాంబ, అఖిల్ తో అందరికీ ప్రసాదం పంచు అని అంటుంది. అప్పుడు జెస్సి, అంటే అఖిల్ ఈవిడ కొడుకా అని ఆశ్చర్య పోతుంది.