ఈరోజు ఎపిసోడ్ లో మాధురికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా అది చూసి జానకి టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత జానకి మాధురి బ్యాగులో ఫోన్ తీసుకొని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తొందరగా హాస్పిటల్ దగ్గరికి రండి అని చెబుతుంది. అప్పుడు జానకి అఖిల్ చేసిన పనిని గుర్తుతెచ్చుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అఖిల్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే మాధురి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు.