Devatha: దేవి, ఆదిత్య బంధంపై సత్యలో మొదలైన అనుమానం.. రాధని నిలదీసిన జానకమ్మ?

First Published Sep 5, 2022, 12:00 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెబర్ 5వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఆదిత్య దేవిని కారులో కూర్చోబెట్టి, ఇక్కడే ఉండమ్మా నేను ఇప్పుడే వస్తాను అని అంటాడు. అప్పుడు దేవి,ఆఫీసర్ సార్ మీరు త్వరగా రాకపోతే నేనే బండిని తోలుకొని వెళ్ళిపోతాను అని అంటుంది.నువ్వు బండిని తోలుతావా! నేర్పించినా? అని అడగగా రెండు రోజులు నేర్పించండి మూడో రోజు కల్లా మీ సహాయం లేకుండా మీ బండి తోలుకుని వెళ్ళిపోతా అని అంటుంది దేవి. అవును సారూ ముందే వెళ్లి అవ్వకి చెప్పండి నేను చిన్న చెల్లిని చూడడానికి వస్తున్నాను అని అంటుంది. అప్పుడు ఆదిత్యా సత్య కి ఫోన్ చేసి దేవి ఇంటికి వస్తుంది అని అంటాడు. అప్పుడు సత్యా సరే అయితే మేము ఎదురు చూస్తున్నాము తీసుకురా అని అంటుంది.
 

అప్పుడు ఆదిత్య, అలాగే దేవికి నచ్చిన స్వీట్స్ తినడానికి ఏమైనా చెయ్యు, దేవికి ఏం నచ్చుతాయో నీకు తెలుసు కదా అని అనగా సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సత్య. అప్పుడు మనసులో సత్య, ఆదిత్య ఇంత ఆనందంగా నాతో మాట్లాడి ఎన్ని రోజులైంద. దేవిని చూడగానే ఉన్న బాధలన్నీ మర్చిపోతాడు అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో మాధవ్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు చిన్మయి,రుక్మిణి అక్కడికి వస్తారు.దేవి ఏది అని అడగగా చిన్నయి నీ రుక్మిణి లోపలికి పంపించేస్తుంది. అప్పుడు రుక్మిణి,మాధవ్ తో దేవి మా ఇంటికి వెళ్ళింది వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళింది అని అంటుంది. అప్పుడు మాధవ్,నాకు కూడా అదే కావాలి.
 

దేవి వాళ్ళ ఇంటికి వెళ్లి పోతే అప్పుడు నువ్వు నేను ఏకాంతంగా ఉండొచ్చు అని అన్నగ రుక్మిణి కి చిరాకు వచ్చి "సారు" అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు మాధవ్ నువ్విలా అరడం వల్ల నీకు ఏమీ ఉపయోగం ఉండదు అని వెళ్ళిపోతాడు. అదే సమయంలో జానకమ్మ అక్కడికి వస్తుంది. ఏమైందమ్మా ఎవరో అరిసినట్టు వినబడింది అని అడగగా లేదు అని అంటుంది రుక్మిణి. దేవి ఏదమ్మా ఇంటికి రాలేదు? అయినా నీ కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? మాధవ్ నిన్ను ఏమైనా అన్నాడా అని అడగగా  రుక్మిణి అరుస్తూ ఎందుకు అందరు నన్ను అడుగుతున్నారు. దేవమ్మకి ఏం కాలేదు ఊరికే నన్ను నేను సతాయించొద్దు అని వెళ్ళిపోతుంది. రాధ ఎందుకు ఇలా ఉన్నది అని జానకమ్మ అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దేవి దేవుడమ్మ దగ్గరికి వెళ్తుంది.
 

అప్పుడు దేవుడమ్మ, అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ దేవిని ఆనందంగా వచ్చి పలకరిస్తారు.అప్పుడు దేవుడమ్మ, ఊర్లో వారందరూ ఆదిత్య కోసం ఎదురు చూస్తే, మేమందరం నీకోసం ఎదురు చూడాల్సి వస్తుంది అని అనగా దేవి,సారు మనం వెళ్ళిపోదాం  వేల్లు సరిగ్గా చూసుకోవట్లేదు అని అంటుంది.అప్పుడు దేవుడమ్మ నవ్వుతూ ఒక్క మాటని కూడా సహించలేవే అని అంటుంది.అప్పుడు దేవి అయినా నేను వచ్చింది మిమ్మల్ని చూడ్డానికి కాదు అవ్వా మా చెల్లి రుక్మిణిని చూసి ఆడుకోవడానికి అని అంటుంది. అప్పుడు కమల పాప నీ తీసుకువస్తుంది.ఆదిత్య ఎత్తుకో అమ్మ మీ చెల్లిని అని అనగా వెళ్లి కాలు చేతులు కడుక్కొని వచ్చి ఎత్తుకుంటాను అని అంటుంది.
 

అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంత చిన్న వయసులోనే అంత బాగా ఆలోచిస్తున్నావో! తల్లి పెంపకం అంత మంచిది అని అనుకుంటారు. అప్పుడు ఆదిత్య,రుక్మిణి తన తల్లి అని తెలిస్తే నువ్వు ఎంత ఆనందపడతావో అమ్మ అని అనుకుంటాడు.ఆ తర్వాత సీన్లో జానకమ్మ రుక్మిణి దగ్గరికి వస్తుంది. నువ్వేమీ అనుకోకపోతే నేను ఒక ప్రశ్న అడుగుతానమ్మ, అది నా స్వార్థం కోసం కాదు కేవలం నీ మీద ఉన్న బెంగ మీదే. నువ్వు ఈ మధ్య ఏదో తెలియని బాధలో ఉంటున్నావు. అదేంటో అనేది మాకు తెలియదు కానీ నీలో నువ్వే కృంగిపోతున్నావు. మాకు చెప్తే నేను దాన్ని పరిష్కరించడానికి సహాయం చేస్తాను అలాగే నువ్వు ఒక్కదానివిలా బాధపడుతూ ఉంటే పిల్లలు సంగతి ఏం కావాలి! నువ్వు ఎప్పుడూ నా మీద అలా అరవలేదు. ఈరోజు ఇలా అరిచావ్ అంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. చిన్నప్పటినుంచి నాకు కూతుర్లు లేరు అనే బాధ ఎప్పుడూ ఉండేది, ఎప్పుడైతే నువ్వు కోడలిగా వచ్చావో అప్పుడు నుంచి నాకు బాధ పోయింది. ఎప్పుడు చిన్మయి ని నీ సొంత కూతురు లాగా చూసుకున్నావు.
 

ఒకప్పుడు నువ్వు ఇంట్లో తిరిగితే మహాలక్ష్మి తిరుగుతున్నట్టు ఉండేది కానీ కూడా సందడి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది. మేము నీకు ఏమైనా లోటు చేస్తున్నామా? అసలు ఏమైంది  అని అనగా రుక్మిణి మనసులో,మీకు ఎలా చెప్తాను మీ కొడుకు వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్తే మీరు తట్టుకోగలరా అనుకుంటుంది. అప్పుడు జానకమ్మ రుక్మిణి తో చిన్మయి భవిష్యత్తు బాగుంటుందని నిన్ను నా కోడలుగా తెచ్చుకుందాం అనుకున్న మాట నిజమే. కానీ నువ్వు ఒప్పుకోకపోయేసరికి మేము ఇంక దాని గురించి ఏమీ అడగలేదు, మరి ఇంకేమైంది అని జానకమ్మ రుక్మిణిని అడుగుతుంది ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!