Guppedantha manasu: చివరికోరిక అంటూ వసుధార మెసేజ్.. కంగారుగా పరుగులు పెట్టిన రిషీ!

First Published Aug 11, 2022, 11:12 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 11వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఎపిసోడ్ ప్రారంభంలోనే... జగతి,మనం రిషి విషయంలో తప్పు చేశామేమో అంతేకానీ మనం స్వార్ధపరులమని నువ్వు ఫిక్స్ అవ్వద్దు. రిషి మన బంధాన్ని యాక్సెప్ట్ చేయలేదేమో ఇంకా అని అంటుంది. అప్పుడు మహేంద్ర, ఈ విషయం కాదు ముందు పెళ్లి గురించి ఆలోచించు అని అంటే, రిషి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు కాని తప్పుడు నిర్ణయాలు తీసుకోడు ఈ పెళ్లి జరగదని నాకు గట్టిగా అనిపిస్తుంది అని అంటుంది.తల్లి ప్రేమ వలన నీకు అలా అనిపిస్తుంది కానీ లగ్నపత్రిక వరకు వచ్చినది ఎలా ఆపగలం అని మహేంద్ర బాధపడతాడు. 
 

తర్వాత సీన్లో రిషి రోడ్డు మీద నిల్చని ఉంటాడు. అప్పుడు సాక్షి అక్కడికి వచ్చి పిలవగానే వచ్చినందుకు థాంక్స్ రిషి అని అంటుంది.నువ్వు పిలిచావు కాబట్టి నేను రాలేదు సాక్షి నాకు రావాలనిపించి వచ్చాను అని చెప్పి, వసుధార గురించి నువ్వు మర్చిపో తన జోలికి వెళ్లొద్దు అని అంటాడు. ఇప్పుడు వసుధార టాపిక్ ఎందుకు అని అనగా,పూర్తిగా చెప్పేది వినడం నేర్చుకో సాక్షి. నేను ఇంకా చెప్పడం పూర్తి కాలేదు అని చెప్పి వసుధార జోలికి వెళ్లొద్దు నేను  కేవలం ఈ విషయం చెప్పడానికి మాత్రమే వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

సాక్షి మనసులో ఈ మాట ఫోన్లో కూడా చెప్పొచ్చు కదా ఇది చెప్పడానికి ఇక్కడి వరకు వచ్చాడా నేను పెళ్లి గురించి మాట్లాడుతాడు అనుకుంటే ఇలా జరిగిందేంటి అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దేవయాని, జగతి మీద గెలిచాను అని సంబరపడిపోతూ ఉంటుంది. ఈ లోగా సాక్షి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది. పెళ్లి నాతో పెట్టుకొని మనసులో వసుధార ఉంటుంది ఎందుకు ఆంటీ? అని తిడుతుంది. అప్పుడు దేవయాని, రిషి నీకు దక్కడమే గొప్ప వరం ఇప్పుడు అందులో వసుధార ఉన్నదా? లేకపోతే ఇంకెవరు ఉన్నారా? అని నీకు అనవసరం.
 

 ఒకసారి పెళ్లయిన తర్వాత రిషి ఎవరో,వసుధార ఎవ.రో అప్పుడు రిషి నీ గుప్పెట్లోకి వెళ్తాడు అని చెప్తుంది. ఈ లోగా జగతి ఆ ఫోన్ని  లాక్కొని ఈ పెళ్లి జరగదు సాక్షి అని అంటుంది. మీరేమీ కంగారు పడొద్దు ఆంటీ పెళ్లి జరుగుతుంది అది మీరు చూస్తారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సాక్షి. ఏం మాట్లాడుతున్నావు జగతి? అని దేవయాని అడగగా, ప్రపంచంలో ఏ జంతువైనా వాలి పిల్లల్ని కాపాడుకుంటుంది. అలాంటిది నేను నా కొడుకుని కాపాడుకోలేనా?అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జగతి.
 

 ఆ తర్వాత సీన్లో వసు ఆ గిఫ్ట్ ని పట్టుకొని సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటి సార్ అని బాధపడుతూ ఉంటుంది.ఈలోగా గౌతమ్ వసుకి ఫోన్ చేసి రిషి నిన్ను ప్రేమిస్తున్నాడు వసుధార ఒకసారి నువ్వు మాట్లాడితే మనసు మార్చుకుంటాడేమో అని అంటాడు.వసు ఫోన్ కట్ చేసి ఏమని మాట్లాడాలి అని మనసులో బాధపడుతూ ఉంటుంది. తర్వాత రిషి గదిలో ఉన్నప్పుడు ధరణి రిషి దగ్గరికి వెళ్లి నువ్వు సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటి రిషి అని అడుగుతుంది.కానీ రిషి మాత్రం ఏవేవో ఉదాహరణలు చెబుతాడు కానీ అసలైన విషయం చెప్పడు.
 

 ధరణి, నేను ఎంత అడిగినా నువ్వు చెప్పవ నాకు అర్థమైంది రిషి అని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతట్లో రిషికి వసు దగ్గర్నుంచి మెసేజ్ వస్తుంది. ఆఖరిసారిగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను సార్ వస్తారా? అని. రిషి టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తాడు ఫోన్ కలవదు కార్ లో కంగారుగా ఇంటికి వెళ్తాడు.కానీ అక్కడ వసు ఉండదు. నెమలిపించాలు, గాజు డబ్బాలో ఆ బాల్స్ రిషి జ్ఞాపకంగా ఉంటాయి. మళ్లీ ఫోన్ చేసేసరికి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏం చేసుకుంటుందో అని భయంతో రిషి పరిగెడుతూ అంత వెతుకుతూ ఉంటాడు.
 

ఈ లోగా వసు ఒక చెట్టు కింద ఆకాశాన్ని చూస్తూ కుర్చీ మీద కూర్చుని ఆకాశంతో కబుర్లు చెబుతూ ఉంటుంది.నేను మీకు ఒక కథ చెప్తాను వింటారా మా రిషి సర్ గురించి, ఆయన ఎలాగా వినరు. అనే లోగా రిషి అక్కడికి వచ్చి కోపంతో వసు ని కొట్టాలని చెయ్యెత్తుతాడు. ఈ లోగా ఆగిపోయి అసలు నీకు ఏమైనా బుద్ధుందా? ఆ మెసేజ్ కి అర్థమేంటి ఎవరైనా అలా చేస్తారా ఎంత భయపడ్డానో తెలుసా అసలు ఏం చేస్తున్నావు? అని అనగా నేను నా బాధలు అన్నీ విశాలమైన ఆకాశంతో చెప్పుకుంటున్నాను సార్.
 

మీరు ఎలాగో వినరు కదా అని అంటుంది. అసలు ఆ మెసేజ్ ఎందుకు పంపావు అని అనగా నాకు మీతో మాట్లాడాలి అనిపించింది సార్. మీరు ఎలాగా రారు కదా అని అంటుంది. నేనెందుకు రాను? అని  రిషి అనగా, మీరు మారిపోయారు సార్ మీరు ఒకప్పటి రిషి సార్ కాదు అని అంటుంది వసు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!

click me!