అసలు అనసూయ తల్లేనా అంటూ ఫైర్ అయిన జబర్ధస్త్ వర్ష...తర్వాత ఫ్లేట్ ఫిరాయించింది..!

First Published Nov 17, 2020, 4:14 PM IST

బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన వర్ష జబర్ధస్త్ షోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైపర్ ఆదితో పాటు, వెంకీ మంకీస్ మరియు కొన్ని టీమ్స్ లో వర్ష లేడీ కామెడియన్ గా నటిస్తున్నారు.

undefined
జబర్ధస్త్ వేదికపై వర్షను చూసిన ఆడియన్స్ పిల్ల కత్తిలా ఉందంటున్నారు. ఇప్పుడిప్పుడే వర్ష పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుండగా, వర్ష బుల్లితెరపై వెలిగిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తుంది.
undefined
వర్షకు వచ్చిన పాపులారిటీ నేపథ్యంలో ఆమె గతంలో చేసిన కొన్ని కామెంట్స్ కి సంబంధించిన వీడియోలు బయటికి తీస్తున్నారు. ఈ క్రమంలో వర్షకు కొత్త చిక్కు వచ్చి పడింది.
undefined
గతంలో అనసూయను విమర్శిస్తూ వర్ష ఓ వీడియో చేశారు. ఓ బాలుడు అనసూయతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నం చేయగా, అనసూయ అతని చేతిలో ఫోన్ లాక్కుకొని పగల గొట్టింది. అనసూయ చర్యకు ఆ బాలుడు మరియు అతని తల్లి షాక్ కి గురయ్యారు.
undefined
కేవలం తనను ఫొటో తీశాడని అనసూయ ఫోన్ పగలగొట్టారని వర్ష తీవ్రంగా ఖండించారు. ఒక తల్లిగా పిల్లాడి మనసు అర్థం చేసుకోకుండా కష్టపెట్టారని వర్ష ఆవేదన వ్యక్తం చేశారు. అనసూయ పిల్లలు కూడా ఓ స్టార్ హీరోతో ఫోటో కోసం ప్రయత్నిస్తే, ఆ హీరో కూడా అనసూయలా ప్రవర్తిస్తే తనకు ఆ బాధ తెలుస్తుంది అన్నారు.
undefined
అప్పట్లో వర్ష ఎవ్వరికీ తెలియకపోవడంతో ఈ వీడియో ఫోకస్ లోకి రాలేదు. ఐతే అనసూయ యాంకర్ గా ఉన్న జబర్ధస్త్ షోకి వర్ష రావడంతో పాటు ఫేమ్ తెచ్చుకోగా, కొందరు మీడియా వాళ్ళు వర్ష పాత వీడియోని బయటకు తీశారు.
undefined
అనసూయపై వర్ష ఫైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వర్ష దీనిపై క్లారిటీ ఇచ్చారు. అనసూయ మంచి తనం గురించి తెలియక అప్పుడు అలా మాట్లాడినట్లు వర్ష చెప్పారు.
undefined
రంగస్థలం షోలో అనసూయను కలిశానని, అప్పుడే తన వ్యాఖ్యల కారణంగా అనసూయను క్షమాపణలు అడిగినట్లు చెప్పారు. అనసూయకు తనకు ఎంతో సహాయం చేసిందన్న వర్ష, నాతో పాటు చాలా మందికి సహాయపడ్డారు అన్నారు.
undefined
click me!