పిల్లలు పుట్టరంటూ పెళ్లికి ముందు డాక్టర్లు షాక్.. గతాన్ని తలచుకుని షోలో రోజా కన్నీళ్లు.. ఇంద్రజ ఓదార్పు

First Published Sep 3, 2021, 6:27 PM IST

`జబర్దస్త్` జడ్జ్, నటి, ఎమ్మెల్యే రోజా తన జీవితంలోని అతిపెద్ద సీక్రెట్‌ని బయటపెట్టింది. ఇన్నాళ్లు తనలో దాచుకున్న విషయాన్ని ఓ షోలో ఓపెన్‌ అయి కన్నీళ్లు పెట్టుకుంది. తన పెళ్లికి ముందు, హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు అనుభవించిందో తెలిపింది. 

`వినాయక చవితి` స్పెషల్‌గా ఈటీవీలో `ఊరిలో వినాయకుడు` పేరుతో ఓ స్పెషల్‌ షో చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో రష్మీ, సుధీర్‌, రోజా, హైపర్‌ ఆది, వర్ష చేసిన సందడి ఆద్యంతం ఆకట్టుకుంది. 
 

ఇందులో భాగంగా ప్రోమో చివర్లో `జబర్దస్త్` జడ్జ్ రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సినీ జీవితం మొత్తం అప్పులు కట్టడానికే అయిందని వాపోయారు. అంతేకాదు పెళ్లికి ముందు తనలో ఉన్న పెద్ద ఫైర్‌ బ్రాండ్‌ని బయటపెట్టారు. ఇన్నాళ్లు సీక్రెట్‌గా దాచుకున్న విషయాన్ని అందరి ముందు ఓపెన్‌ అయి కన్నీరు మున్నీరమయ్యింది రోజా. 
 

తాను 1991లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టానని తెలిపింది. దాదాపు 11ఏళ్లు అంటే 2002 వరకు తాను నటించి సంపాదించిందంతా అప్పులు కట్టడానికే సరిపోయిందంటూ ఎమోషనల్‌ అయ్యింది రోజా. 1990-2000 వరకు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది రోజా. 
 

పీక్‌ టైమ్‌లోనూ తాను అప్పులే కట్టాల్సి వచ్చిందని చెప్పి షాక్‌ ఇచ్చింది. మరోవైపు పెళ్లికి ముందు తన జీవితంలోని మరో సీక్రెట్‌ని వెల్లడించింది. పెళ్లికి ముందే తనలో పెద్ద ఫైర్‌ బ్రాండ్‌ ఉందని, డాక్టర్లు పిల్లలు కారని చెప్పారట. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యింది రోజా. 

పిల్లలు కారనే విషయం తనని బాగా కుంగదీసిందని, కానీ పెళ్లి తర్వాత ఏడాదిలోనే తనకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్‌ అయ్యిందని చెప్పింది. మొదటగా అన్షు పుట్టిందని, అందుకే తానంటే ఎంతో ఇష్టమని తెలిపింది. దీంతో చలించిపోయిన ఇంద్రజ పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హగ్‌ చేసుకుని రోజాని ఓదార్చింది. 

తన ఇద్దరు పిల్లలు కూతురు అన్షు, కుమారుడితో కలిసి ఈ షోలో పాల్గొంది రోజా. అదిరిపోయే డాన్సులతో సందడి చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంది. హైలైట్‌గా నిలిచింది. రోజా గత విషయాలకు యాంకర్‌ రష్మీ, నటి ఇంద్రజ సైతం కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని గుండె బరువెక్కించింది.
 

click me!