రష్మీ సంచలన వ్యాఖ్యలు `అలా పిల్లలను కనే బదులు.. అలా చేయొచ్చు కదా

First Published May 18, 2020, 5:55 PM IST

టాలీవుడ్‌ లో నటిగా, బుల్లితెర స్టార్ యాంకర్‌గా సూపర్‌ పాపులర్ అయిన బ్యూటీ రష్మీ గౌతమ్‌. కేవలం సినిమాలతోనే కాదు వివాదాస్పద వ్యాఖ్యలతోనూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది రష్మీ. ముఖ్యంగా సుధీర్‌తో ప్రేమ వ్యవహారం తో రష్మీ పేరు మీడియాలో మారుమోగిపోయింది. తాజాగా ఈ భామ సరోగసి (అద్దె గర్భంతో పిల్లలను కనటం)పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తెర మీద హాట్ హాట్‌గా అందాలు ఆరబోసే రష్మీ, సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటుంది. తన మీద వచ్చే విమర్శల విషయంలో ఘాటుగా స్పందించే ఈ బ్యూటీ, సామాజిక అంశాల విషయంలో కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతూ ఉంటుంది.
undefined
తాజాగా ఈ భామ సరోగసి (అద్దె గర్భంతో పిల్లలను కనడం)పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో చాలా మంది పిల్లలు సరోగసి ద్వారా పిల్లలను కన్నారు. బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచు లక్ష్మీ వంటి వారు ఈ పద్దతిలో పిల్లలను కన్నారు.
undefined
జంతువులకైనా పిల్లలను కనడానికి ఓ సీజన్‌ ఉంటుందేమో కానీ మనుషులకు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం పరిస్థితుల్లో అనాథ పిల్లలను దత్తత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావటం లేదని ఆరోపించింది.
undefined
వయసైన వారు, అవకాశం లేని వారు అంతా సరోగసి ద్వారానే పిల్లలను కంటున్నారు. అలాంటి వారిని ఉద్దేశిస్తూ అలా పిల్లలను కనటం కన్నా ఎవరినైన దత్తత తీసుకోవచ్చుగా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అద్దె గర్భంతో వచ్చే పిల్లల కన్నా దత్తత తీసుకోవటమే మంచిదని అభిప్రాయపడింది.
undefined
అయితే ఈ సందర్భంగా కేవలం మీ రక్తం పంచుకు పుట్టిన వారినే ప్రేమిస్తారా..? మిగతా వారిన ద్వేషిస్తారా..? అలాంటి ఆలోచన చిన్నారుల పట్ల వివక్ష చూపించటమే అని వింత వాదన తెర మీదకు తీసుకువచ్చింది. అంతేకాదు మరో అడుగు ముందుకు వేసి అది కులాభిమానం, మతాభిమానం లాంటిదే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
undefined
జీన్స్ అనేది పిల్లల్లో కొంత వరకే ఉంటుందన్న రష్మీ, ఎక్కువ భాగం పిల్లల వ్యక్తిత్వం అనేది తల్లిదండ్రుల పెంపకం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పింది. అయితే రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది.
undefined
సరోగసి అనేది చట్ట వ్యతిరేఖం కానప్పుడు ఆ పద్దతిలో పిల్లలను పొందేవారిని విమర్శించటం ఏంటి అంటున్నారు నెటిజెన్లు. అంతేకాదు ఎవరూ దత్తత తీసుకోవటం లేదని నువ్వెలా అంటావు. అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నారని రష్మీకి సమాధానమిస్తున్నారు. మరీ నెటిజెన్ల రెస్పాన్స్‌పై రష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
undefined
click me!