ఎక్సపోజింగ్ లో పీహెడ్ డీ చేస్తోందీ తెలుగు పిల్ల
First Published May 18, 2020, 12:37 PM IST
ఈ అమ్మాయి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013) చిత్రం ద్వారా తేజస్వి తెలుగు పరిశ్రమకి పరిచయమైంది. ఆ తరవాత నుంచి ఆమె సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ‘మనం’, ‘హార్ట్ ఎటాక్’ సినిమాల్లో నటించింది. ఆ తరవాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్క్రీం’ చిత్రంతో హీరోయిన్గా మారింది. ఈ సినిమాలో హాట్ హాట్గా అందాలు ఆరబోసింది. 2017 వరకు ఏడాదికి నాలుగు నుంచి ఏడు సినిమాల్లో నటించిన తేజస్వి.. 2018లో బిగ్ బాస్ సీజన్ 2 షోలో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. మొదట్లో హీరోయిన్ పక్కన సహాయ నటిగా చేసిన తేజస్వి.. ఆ తరవాత హాట్ స్టార్గా మారి దుమ్ము దులపటం మొదలెట్టింది. అయితే, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరవాత ఆమె ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. కాకపోతే టీవీ షోలలో బాగానే కనిపిస్తోంది. పదహారణాల తెలుగు అమ్మాయి అయినా తేజుకు ఎందుకనో తెలుగు నుంచి ఆఫర్స్ పెద్దగా రావటం లేదు. అయితే తేజస్వి కెరీర్ లో ఎత్తుపల్లాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటిలాగే రెచ్చిపోతోంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.