టాలీవుడ్ లో లెజెండ్రీ నటీమణుల్లో వాణిశ్రీ ఒకరు. వాణిశ్రీ అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలతో వందల చిత్రాల్లో నటించారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో వాణిశ్రీ తల్లి, అత్త తరహా పాత్రలు కూడా చేశారు.
వాణిశ్రీకి, హీరో జేడీ చక్రవర్తికి మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగిందట. ఈ విషయాన్ని జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. వీళ్ళిద్దరూ బొంబాయి ప్రియుడు చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్ రంభకి తల్లిగా నటించారు. అప్పటికి జెడి చక్రవర్తికి వాణిశ్రీతో పరిచయం లేదట. మా అమ్మ మాత్రం వాణిశ్రీకి పెద్ద అభిమాని అని జెడి చక్రవర్తి అన్నారు.