టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడులు ముగిశాయి. నాలుగు రోజుల పాటు అధికారులు దిల్ రాజు, ఆయన కుమార్తె హన్షిత రెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దిల్ రాజు బ్రదర్ శిరీష్ ఇంట్లో కూడా రైడ్స్ జరిగాయి. దిల్ రాజు మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం 18 ప్రదేశాల్లో అధికారులు 55 బృందాలుగా విడిపోయి రైడ్స్ చేశారు.