పీపుల్స్ మీడియా వారికి నాలుగు సినిమాలు 100 కోట్లకు చేస్తానని ఎగ్రిమెంట్ చేసి అందులో భాగంగా ధమాకా, ఈగల్, మిస్టర్ బచ్చన్ చేసారని, ఇంకో సినిమా పెండింగ్ ఉందని తెలుస్తోంది. అలా ముందు తన పేమెంట్ సెట్ అయ్యితే డేట్స్ ఇచ్చేద్దామనే ధోరణే రవితేజని ముంచేస్తోందని ట్రేడ్ లో , ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆయన గత నాలుగైదు ఏళ్లుగా ఈ స్కీమ్ లోకి వచ్చారని చెప్తున్నారు. అయితే మూడు సినిమాల్లో ఒకటే ఆడింది. అదే ధమాకా.