పవన్‌, రేణూల మధ్య త్రివిక్రమ్.. సంచలనం సృష్టిస్తున్న పూనమ్ ట్వీట్స్

First Published Jun 18, 2020, 11:52 AM IST

వివాదాస్పద ట్వీట్లతో ఎప్పుడు వార్తల్లో నిలిచే టాలీవుడ్‌ హాట్ బ్యూటీ పూనమ్‌ కౌర్‌. గతంలో ఈ అమ్మడు చేసిన ట్వీట్ పవన్‌, త్రివిక్రమ్‌లను ఉద్దేశించే అని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను పూనమ్‌ ఖండించకపోవటంతో అంతా నిజమే అనుకున్నారు. ఇటీవల చాలా కాలంగా సైలెంట్‌గా ఉన్న ఈ బ్యూటీ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

రెండు రోజులుగా పూనమ్‌ కౌర్ సోషల్ మీడియాలో సంచలన ట్వీట్స్ చేస్తోంది. పేర్లు చెప్పకపోయినా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని టార్గెట్‌ చేస్తూ కామెంట్స్ చేస్తోంది. అయితే ఆ కామెంట్స్‌కు గూరూజీ అనే ట్యాగ్‌ను జోడించటంతో పూనమ్ చేస్తున్న కామెంట్స్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఉద్దేశించే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
undefined
బుధవారం చేసిన ట్వీట్లలో వివాదాస్పద ఆరోపణలు చేసింది పూనమ్‌. గతంలో తాను డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానన్న సదరు వ్యక్తి స్పందించలేదని ఆవేదన వ్యక్తి చేసింది. అంతేకాదు `నువ్వు చచ్చిపోతే కేవలం ఒక రోజు న్యూస్‌ అవుతావు` అంటూ వెటకారంగా మాట్లాడినట్టుగా ఆమె వెల్లడించింది.
undefined
ఎన్నో రకాలు ప్రాధేయపడిన ఆ వ్యక్తి తన పరిస్థితి మెరుగయ్యేందుకు సాయం చేయలేదని చెప్పింది. అంతేకాదు మీడియాలో తప్పుడు కథనాలు రాయించి తనను మానసికంగా వేదించాడని, తన పలుబడిని వినియోగించి అవకాశాలు రాకుండా చేశాడని చెప్పింది. దీంతో ఒక్కసారి టాలీవుడ్‌లో కలకలం మొదలైంది.
undefined
అందుకు కొనసాగింపుగా ఆ వ్యక్తి గురించి మరిన్ని కామెంట్లు చేసింది. తననే కాదుఆ వ్యక్తి ఓ స్నేహితుడిని కూడా ఇబ్బందులు పాలు చేశాడని ట్వీట్ చేసింది పూనమ్‌. `నువ్వు నీ స్నేహితుడిని అతనికి ఎంతో నచ్చిన భార్య దగ్గరకు తిరిగి వెల్లకుండా చేశావు. ఆమె తన భర్తను ఎంతగానో ప్రేమించేది. కానీ ఇప్పుడు ఆమె ఎన్నో విమర్శలు ఎదుర్కొంటుంది. అందుకు నువ్వే కారణం. ఇప్పుడు వాళ్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఈ పని ఎందుకు చేశావు. అతన్ని నువ్వు స్లో పాయిజన్‌తో చంపాలనుకున్నావా?` అంటూ ప్రశ్నించింది.
undefined
అయితే ఈ వ్యాఖ్యలు త్రివిక్రమ్‌ను ఉద్దేశించి చేసినట్టుగా భావిస్తున్న నెటిజెన్లు ఆ భార్యా భర్తలు పవన్‌ కళ్యాణ్ రేణూ దేశాయే అని కామెంట్‌ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. పవన్‌, రేణూ లు విడిపోవటం వెనక ఉన్నది త్రివిక్రమా..? మాకు ఇప్పటికీ రేణూ దేశాయ్ పడిన వేదన గుర్తుంది. ఈ పోరాటంతో నీకు మా మద్దతు ఉంటుంది అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
undefined
ఇప్పటికే రేణూ దేశాయ్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో కామెంట్లు వస్తుంటాయి. ఒక దశలో ఆమె ఆ ట్వీట్లు భరించలేక సోషల్ మీడియాకు దూరమైంది. ఇటీవల తిరిగి పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చింది రేణూ. అయితే తాజాగా పూనమ్ ట్వీట్ నేపథ్యంలో పవన్‌ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
undefined
click me!