ఇలాంటి డైరెక్టర్ కదా మెగాస్టార్ కి కావాల్సింది.. 'సైరా' కాంబో రిపీట్.. ఈసారి ఎలాంటి చిత్రం అంటే ?

First Published Jan 20, 2023, 3:08 PM IST

వాల్తేరు వీరయ్య చిత్రం భారీ విజయం సాధించడంతో సహజంగానే చిరంజీవి నెక్స్ట్ చిత్రాలపై అంచనాలు పెరుగుతాయి. ఈ క్రమంలో మెగా అభిమానులు కోరుకునే క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆచార్య దారుణమైన పరాజయం.. గాడ్ ఫాదర్ మూవీ యావరేజ్ గా నిలవడంతో మెగాస్టార్ చిరంజీవిపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆచార్య చిత్రంతో మెగా అభిమానులు సైతం నిరాశలో కుంగిపోయారు. కానీ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో మామూలు కంబ్యాక్ ఇవ్వలేదు. ఈ చిత్రం టాలీవుడ్ లో రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ గా మారిపోయింది. 

ఫస్ట్ వీక్ లోనే దాదాపు 95 కోట్ల పైగా షేర్ రాబట్టిన ఈ చిత్రం 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. మెగాస్టార్ ఈ చిత్రంలో తన స్ట్రాంగ్ జోన్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో అలరించారు. వాల్తేరు వీరయ్య చిత్రం భారీ విజయం సాధించడంతో సహజంగానే చిరంజీవి నెక్స్ట్ చిత్రాలపై అంచనాలు పెరుగుతాయి. 

ఈ క్రమంలో మెగా అభిమానులు కోరుకునే క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి మరోసారి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ దాదాపుగా ఖరారైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

వీరిద్దరి కాంబోలో ఆల్రెడీ సైరా లాంటి చారిత్రాత్మక చిత్రం వచ్చింది. సాధారణంగా సురేందర్ రెడ్డి యాక్షన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు పెట్టింది పేరు. ఇక చిరు కూడా సైరా లాంటి పాత్ర గతంలో చేయలేదు. చిరు ఎంతో ఇష్టపడి చేసిన ప్రయోగాత్మక చిత్రం అది. ఆ చిత్ర అవుట్ ఫుట్ బావున్నప్పటికీ భారీ బడ్జెట్ చిత్రం కావడం వల్ల కొంత మేర నష్టాలు కలిగాయి. 

కానీ ఈ సారి సురేందర్ రెడ్డి.. చిరంజీవి కోసం మాస్ మసాలా అంశాలు ఉండే యాక్షన్ కామెడీ కథ సిద్ధం చేస్తున్నట్లు టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. 

ఇక సురేందర్ రెడ్డి.. అక్కినేని అఖిల్ హీరోగా స్పై థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరంజీవి, సురేందర్ రెడ్డి కాంబోలో చిత్రం వీలైనంత త్వరగా ప్రారంభం కావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

click me!