చిరంజీవిని రజనీ మోసం చేశారా.. ఆ నాలుగు సందర్భాల్లో ఏం జరిగిందంటే, 24 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ సమరం 

Published : Aug 09, 2023, 05:45 PM IST

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రాలు ఒక్క రోజ వ్యవధిలో బాక్సాఫీస్ యుద్దానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరు, రజని మధ్య అనుభందం.. గతంలో వారిద్దరి చిత్రాల మధ్య పోటీ లాంటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

PREV
17
చిరంజీవిని రజనీ మోసం చేశారా.. ఆ నాలుగు సందర్భాల్లో ఏం జరిగిందంటే, 24 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ సమరం 

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రాలు ఒక్క రోజ వ్యవధిలో బాక్సాఫీస్ యుద్దానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరు, రజని మధ్య అనుభందం.. గతంలో వారిద్దరి చిత్రాల మధ్య పోటీ లాంటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

27

చిరంజీవి కంటే రజనీకాంత్ కొన్నేళ్ల ముందు ఇండస్ట్రీకి వచ్చారు. మద్రాసు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చిరు శిక్షణ పొందుతున్నప్పడు అక్కడే రజనీ సీనియర్ గా ఉన్నారు. కెరీర్ ఆరంభంలో రజని, చిరు పలు చిత్రాల్లో నటించారు. అంతే కాదు ఒకే సందర్భంలో కొన్ని రోజుల వ్యవధిలో వీరిద్దరూ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఆ విధంగా నాలుగుసార్లు చిరు, రజనీ నటించిన చిత్రాలు పోటీ పడ్డాయి. ఇప్పుడు జైలర్, భోళా శంకర్ చిత్రాలతో ఐదవసారి రజనీకాంత్, చిరు మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతోంది. ఆగష్టు 10న జైలర్ రిలీజ్ అవుతుండగా.. ఆగష్టు 11న భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

37

తొలిసారి రజని, చిరు 1979లో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఆ ఏడాది జనవరి 12న తాయారమ్మ బంగారయ్య చిత్రం విడుదలయింది. అయితే ఇందులో చిరంజీవి పూర్తి స్థాయి పాత్రలో నటించలేదు. సూపర్ స్టార్ కృష్ణతో కలసి రజనీకాంత్ నటించిన ఇద్దరూ అసాధ్యులే చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్, స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన టైగర్ చిత్రం అదే ఏడాది సెప్టెంబర్ 5 న విడుదలయింది. పదిరోజుల వ్యవధిలో చిరంజీవి నటించిన కోతల రాయుడు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది. 

47

1980లో చిరు రజని మరోసారి బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు. చిరు, శోభన్ బాబు.. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించిన మోసగాడు చిత్రం ఆ ఏడాది మే 22న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. విజయ నిర్మల తెరకెక్కించిన రామ్ రాబర్ట్ రహీం చిత్రంలో కృష్ణ, రజనీకాంత్, చంద్రమోహన్ నటించారు. ఈ మూవీ మే 31న విడుదలై ప్రేక్షకులని ఆకట్టుకుంది. 

57

ఇక చివరగా రజని, చిరు బాక్సాఫీస్ వద్ద తలపడింది 1999లోనే. అయితే ఈ ఏడాది మాత్రం రజనీకాంత్ దే పైచేయి. ఏప్రిల్ 10న విడుదలైన రజనీ నరసింహ చిత్రం ఘనవిజయం సాధించింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఇద్దరు మిత్రులు చిత్రం ఏప్రిల్ 30న విడుదలై ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ అగ్ర హీరోలు ఒక్క రోజు వ్యవధిలో బాక్సాఫీస్ సమరానికి సై అంటున్నారు. 

67

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అదే విధంగా వేదాళం రీమేక్ గా చిరంజీవి భోళా శంకర్ చిత్రం తెరకెక్కింది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా స్టార్ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. బాక్సాఫీస్ పోటీ పక్కన పెడితే కెరీర్ ఆరంభం నుంచి చిరంజీవి, రజనీకాంత్ మధ్య మంచి బాండింగ్ ఉంది. 

 

77

రజనీకాంత్ తనకి స్ఫూర్తి అని చిరు గతంలో పలుమార్లు చెప్పారు. అయితే ఒక్క విషయంలో మాత్రం రజనీ తనని మోసం చేశారని చిరు.. రోబో రిలీజ్ సమయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ అన్ని రకాల చిత్రాలు చేశారు. ఇక రాజకీయాల్లోకి వస్తారు అనుకున్నా. అందుకే ముందుగా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యా. కానీ రజనీ మాత్రం తనని మోసం చేస్తూ రాజకీయాల్లోకి రాలేదు. రోబో చిత్రం చేసి ఆశ్చర్యపరిచారు. ఒకే వేళ నేను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే అది రోబో మూవీని స్ఫూర్తిగా తీసుకునే వస్తానని చిరంజీవి అప్పట్లో వ్యాఖ్యలకి చేశారు. ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

click me!

Recommended Stories