Nagarjuna: కింగ్ నాగార్జున మనవరాలు ఎవరో తెలుసా, అన్నపూర్ణ స్టూడియోస్ ని శాసిస్తోంది.. ఎవరికీ తెలియని విషాదం

Published : Aug 12, 2026, 05:01 PM IST

అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో ఆయనకి మనవరాలు వరసయ్యే వ్యక్తి ఉన్నారు. ఆమె ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో కీలక బాధత్యల్లో ఉన్నారు. ఆమె కుటుంబంలో విషాదం కూడా ఉంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
Nagarjuna

లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు టాలీవుడ్ లో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు. అక్కినేని కుటుంబ సభ్యులు సినిమాల్లో, సినిమా బిజినెస్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. కింగ్ నాగార్జున టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరు. ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా రాణిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ అంటే ఎక్కువగా కనిపించేది వీళ్ళే. కానీ ఏఎన్నార్ కుటుంబ సభ్యులు తెర వెనుక ఇంకా చాలా మంది ఉన్నారు.

25
అన్నపూర్ణ స్టూడియోస్ ని శాసిస్తున్న నాగార్జున మనవరాలు

అక్కినేని ఫ్యామిలీలో నాగార్జునకి మనవరాలు అయ్యే ఓ అమ్మాయి అన్నపూర్ణ స్టూడియోస్ ని శాసిస్తోంది అని తెలుసా ? అవును ఇది నిజం. ఆమె ఎవరో కాదు నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ కుమార్తె. సుప్రియ తన కుమార్తెని మీడియాకి దూరంగా ఉంచుతూ పెంచారు. అందుకే ఆమె గురించి పూర్తిగా వివరాలు బయటకి రాలేదు. కానీ సుప్రియ కూతురు అన్నపూర్ణ స్టూడియోస్ లో కీలక బాధ్యతల్లో విధులు నిర్వహిస్తున్నట్లు మాత్రం తెలుసు.

35
సుప్రియ యార్లగడ్డ కుమార్తె

ఆమె విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వివిధ ఎంఎన్ సీ లలో వర్క్ చేశారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేస్తున్నారు. సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె కూతురు కూడా మంచి పొజిషన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఫ్యామిలీలో కొన్ని విషాదకర సంఘటనలు ఉన్నాయి. సుప్రియ, సుమంత్ అన్నా చెల్లెళ్ళు. వీరి తల్లిదండ్రులు సురేంద్ర యార్లగడ్డ, సత్యవతి చిన్నతనంలోనే మరణించారు.

45
సుప్రియ భర్త ఎవరంటే

దీనితో వీరిని పెంచి పెద్ద చేసింది నాగేశ్వర రావు. ఆ తర్వాత సుప్రియ పవన్ కళ్యాణ్ సరసన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. కానీ ఆమె ఆ ఒక్క సినిమాలో మాత్రమే హీరోయిన్ గా నటించారు. శ్రీయ శరన్ తొలి చిత్రం ఇష్టం మూవీలో చరణ్ రెడ్డి హీరోగా నటించారు. అతడితో సుప్రియ ప్రేమలో పడడం, వివాహం చేసుకోవడం జరిగింది. వీరిద్దరికీ కుమార్తె జన్మించింది.

55
చరణ్ రెడ్డి మరణం

కానీ చరణ్ రెడ్డి తాగుడుకు బానిసై అనారోగ్యం వాళ్ళ 37 ఏళ్ళ వయసులోనే మరణించారు. అప్పటికే సుప్రియ, చరణ్ రెడ్డి విడాకులు తీసుకున్నారు. సింగిల్ మదర్ గా సుప్రియ తన కుమార్తెని పెంచి పెద్ద చేసింది. చరణ్ రెడ్డి 2012లో అనారోగ్యంతో మరణించారు. ఇన్ని విషాదాలు ఉన్నపప్టికీ సుప్రియ కూతురు తల్లి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతిభావంతురాలిగా అన్నపూర్ణ స్టూడియోస్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories