కెజిఎఫ్ సిరీస్... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్-యష్ లతో భారీ మల్టీస్టారర్?

Published : Jun 05, 2022, 10:21 AM IST

హాలీవుడ్ మార్వెల్ సూపర్ హీరోస్ సిరీస్ మాదిరి బడా పాన్ ఇండియా స్టార్స్ తో కెజిఎఫ్ సిరీస్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వార్త సంచలనం రేపుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ ప్రాజెక్ట్ కి పునాదులు వేస్తున్నట్లు తెలుస్తుంది.   

PREV
15
కెజిఎఫ్ సిరీస్... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్-యష్ లతో భారీ మల్టీస్టారర్?
Prabhas

దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashnath Neel) కేవలం రెండు చిత్రాలతో దేశంలోనే టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. యష్ హీరోగా కెజిఎఫ్, కెజిఎఫ్ 2 బాక్సాఫీస్ షేక్ చేశాయి. వందల కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డ్స్ నెలకొల్పోయాయి. ఫస్ట్ పార్ట్ కి పదింతల విజయం పార్ట్ 2 దక్కించుకుంది. రూ. 1200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ తో దుమ్మురేపింది. కెజిఎఫ్ 2 విడుదలై 50రోజులు అవుతున్నా ఆ ఫీవర్ తగ్గలేదు. 
 

25
Prabhas


అన్ని భాషల్లో సక్సెస్ కొట్టిన కెజిఎఫ్ 2 (KGF Chapter 2) చిత్రానికి సీక్వెల్ ఉందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అలాగే ప్రశాంత్ నీల్ అప్ కమింగ్ చిత్రాలన్నీ, ఒకదానితో మరొకటి లింక్ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అంటే ప్రభాస్ సలార్, ఎన్టీఆర్ తో చేయనున్న మూవీ కథలు కెజిఎఫ్ కథతో ముడిపడి ఉంటాయనే ఓ వాదన ఉంది. కెజిఎఫ్ 2 లోని కొన్ని పాత్రలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. నెక్స్ట్ చిత్రాలకు ఆయన కథలో లీడ్ వదిలినట్లు తెలుస్తుంది. 

35
Prabhas


ఈ క్రమంలో కెజిఎఫ్ సిరీస్లో భాగంగా ప్రభాస్ (Prabhas) -యష్ కాంబినేషన్ లో ప్రశాంత్ నీల్ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడనే సందేహం మొదలైంది. కెజిఎఫ్ 2 సిరీస్లో భాగంగా తెరకెక్కే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు ప్రశాంత్ నీల్ బర్త్ డే నాడు జరిగాయనే ఓ వార్త పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. హాలీవుడ్ మార్వెల్ సిరీస్ మాదిరి, బడా స్టార్స్ తో మల్టీస్టారర్స్ చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించిన నేపథ్యంలో, ఈ వార్తలకు బలం చేకూరుతుంది. 

45
Prabhas

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ (Salaar) మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. 30-35 శాతం షూటింగ్ పూర్తి కాగా, ప్రభాస్ పై ప్రస్తుతం భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సలార్ 2023 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక రోల్ చేస్తున్నారు. 
 

55
Prabhas

సలార్ అనంతరం ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని ప్రశాంత్ నీల్ పట్టాలెక్కిస్తారు. ఇది కూడా భారీ పాన్ ఇండియా మూవీ నేపథ్యంలో రెండేళ్ల సమయం తీసుకోవచ్చు. ఎన్టీఆర్ మూవీ అనంతరం ప్రభాస్-యష్ ల మల్టీస్టారర్ పై క్లారిటీ వచ్చే అవకాశం కలదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, యష్ (Yash)లాంటి అతిపెద్ద పాన్ ఇండియా స్టార్స్ కలిసి నటిస్తే, ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఈ ప్రాజెక్ట్ సాకారం కావాలని అందరూ కోరుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories