Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు

Published : Feb 12, 2026, 10:33 AM IST

Illu Illalu Pillalu Today Episode Feb 12: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో రామరాజు ఇంట్లో అనుకోని సంఘటనలు బయటపడతాయి. రైస్ మిల్లును తెలివిగా దక్కించుకుంటుంది వల్లి బ్యాచ్. ఇక సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం గురించి రామరాజుకు తెలిసిపోతుంది. 

PREV
14
వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో శ్రీవల్లి గుడి చుట్టూ పొర్లుదండాలు పెట్టడం వల్ల బాగా ఆకలేస్తుందని ఏదైనా తినాలని అనుకుంటుంది. వంటగదిలోకి వెళ్లి దోశెలు వేసుకునేందుకు వెళుతుంది. శ్రీవల్లి దోశలు వేసుకుంటూ ఉంటే ఇడ్లీ బాబాయి, భాగ్యం కూడ వస్తారు. నర్మద, ప్రేమ అక్కడికి వస్తారు. ఏం చేస్తున్నారని అడిగితే శ్రీవల్లి దోసెలు వేసుకొని తింటున్నామని చెబుతుంది. అప్పుడు ప్రేమ ‘మీరు ఎంత తిన్నా ఏది తిన్నా నర్మదక్క మీ నిజాన్ని బయటపెట్టే వరకే. ఆ తర్వాత మూట ముళ్ళే సర్దుకుని వెళ్లాల్సిందే’ అని అంటుంది. అప్పుడు ‘మేము ఎందుకు బయటకు వెళ్తాము.. విశ్వక్ అమూల్యకు తాళి కట్టలేదంట కదా’ అని ఒక్కసారిగా షాక్ ఇస్తారు శ్రీవల్లి బ్యాచ్. దీంతో నర్మద, ప్రేమ ఆశ్చర్యపోతారు. 

ప్రేమ గాభరా పడుతూ ‘ఏంటి మాట్లాడుతున్నావ్? అమూల్య మెడలో విశ్వ తాళి కట్టకపోతే మరి ఎవరు కట్టారు? అమూల్యనే వేసుకుందా? నీకు ఎవరు చెప్పారు’ అని పదేపదే అడుగుతుంది. ఆ తర్వాత ‘అసలు అమూల్య పెళ్లి ఎలా జరిగింది అన్నది అసలు మేటర్ కాదు. అమూల్యకు విశ్వక్ ను ప్రేమించమని చెప్పింది నువ్వే అయినప్పుడు.. నువ్వు ఎలా తప్పించుకుంటావు’ అని శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. దీంతో వల్లి భయపడుతుంది. అక్కడి నుంచి తోటి కోడళ్ళు పక్కకి వెళ్లి పోతారు. విశ్వక్ అమూల్య పెళ్లి సంగతి వల్లికి తెలియడంతో ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు నర్మద ధైర్యం చెప్పి అంతవరకు వస్తే చూసుకుందాంలే అని అంటుంది.

24
రైస్ మిల్లు చూడనని చెప్పేసిన సాగర్

రామరాజు వేదవతి ఒక నిర్ణయం తీసుకొని తమ పిల్లలందరినీ పిలుస్తారు. రామరాజు మాట్లాడుతూ సాగర్ తో ‘నేను చాలా కుంగిపోయాను. అమూల్య బాధ నుంచి బయటపడలేకపోతున్నాను. అందుకే ఇక రైస్ మిల్లు నేను చూసుకోలేను. ఇకపైన రైస్ మిల్లు నువ్వే చూసుకోవాలి’ అని తాళాలు అందిస్తాడు. కానీ సాగర్ తాళాలు తీసుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అందరూ తీసుకోమని చెబితే కూడా సాగర్ తీసుకోడు. తండ్రితో అసలు విషయం చెప్పేందుకు సిద్ధమవుతాడు. ‘సారీ నాన్న నేను రైస్ మిల్ లో చూసుకోలేను. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది’ అని చెబుతాడు.

రామరాజు మాట్లాడుతూ ‘ఎప్పుడు పరీక్ష రాశావు. పరీక్ష రాసినప్పుడు కనీసం చెప్పాలి కదా. నీకు గవర్నమెంట్ జాబ్ వద్దని ఎప్పుడో చెప్పాను కదా’ అని అంటాడు. దానికి సాగర్ మాత్రం నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి నాన్న అని చెబుతాడు. అప్పుడు రామరాజు మీ మామయ్య గుడిలో అర్చనలు చేయించి అందరికీ స్వీట్లు పంచుతూ ఉంటే నాకు ఏమీ అర్థం కాలేదు.. ఇప్పుడు అసలు విషయం అర్థం అవుతుంది, నీ భార్య నీ మామ కలిసి చాలా తెలివిగా ప్రవర్తించారు అని అంటాడు. దాంతో నర్మద మధ్యలో కల్పించుకొని నాకు కూడా ఈ విషయం నిన్నే తెలిసింది మావయ్య అని చెప్పబోతుంది. అప్పుడు వేదవతి కోపంగా ఆపమ్మా నువ్వే వాడితో పరీక్ష రాయించి తెలియదంటే నమ్మడానికి ఏమైనా పిచ్చోళ్ళమా’ అని అంటుంది.

34
సాగర్ ను కొట్టిన వేదవతి

అప్పుడు సాగర్ నిజంగానే నర్మదకు ఏమీ తెలియదు అని అంటాడు. దాంతో వేదవతి సాగర్ ను లాగిపెట్టి ఒకటి కొడుతుంది. సొంత మిల్లును దర్జాగా చూసుకోమంటే మీకు మూటలు మోయడంలా అనిపిస్తుందా? మనం తినే ప్రతి మెతుకు ఆ రైస్ మిల్ వల్లే వచ్చింది. మీ నాన్న కూడా నీలాగే మూటలు మోయడం అనుకుంటే ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళమో తెలుసా? అని బుద్ధి చెబుతుంది. రామరాజు కల్పించుకొని ‘వదిలేయ్ బుజ్జమ్మ.. వాడికి ఇల్లరికం వెళ్లాలని ఉందనుకుంటా’ అని అంటాడు. ఆ తర్వాత తిరుపతి తో రైస్ మిల్లు అమ్మేస్తాను ఎవరైనా కొంటారేమో చూడు అని చెబుతాడు. కానీ అందరూ అమ్మవద్దని రామరాజుకు చెబుతారు. రామరాజు మాట్లాడుతూ ‘వీడికి రైస్ మిల్లును చూసుకోవడం నామోషీలా అనిపిస్తోంది. నేను పోయిన తర్వాత ఎలాగో అమ్మేస్తారు కదా’ అని అంటాడు. అప్పుడు ప్రేమ ధీరజ్ తో మాట్లాడుతూ నువ్వు తీసుకుంటానని చెప్పు అని అంటుంది.

44
వల్లి చేతికి రైస్ మిల్లు తాళాలు

ఇంతలో చందు ముందుకు వచ్చి నేను రైస్ మిల్లు చూసుకుంటాను నాన్నా, ఉద్యోగం మానేస్తా అని చెబుతాడు. అప్పుడు రామరాజు ‘వద్దులేరా నీ భార్య కూడా నువ్వు మూటలు మోస్తావని అనుకుంటుంది’ అంటాడు. ఇంతలో వల్లి వచ్చి ‘అయ్యో అలా ఎందుకు అనుకుంటా మావయ్యా.. కావాలంటే నేను కూడా అక్కడ మూటలు మోస్తాను. మా ఆయనకు బాధ్యతలు ఇచ్చేయండి’ అంటుంది. రామరాజు వేదవతితో ‘చూసావా బుజ్జమ్మ బాగా బాధ్యత తెలిసిన కోడళ్లు అని పొగుడుతావు కదా.. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు’ అంటాడు. ‘ఎవరు ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది’ అని వేదవతి నర్మదను చూస్తూ అంటుంది.

వల్లి వేదవతి దగ్గరికి వెళ్లి కొంగుచాచి ‘అత్తయ్య గారు ఇకపైన నేను, నా భర్త రైస్ మిల్లు చూసుకుంటాం. తాళాలు ఇవ్వండి’ అని అడుగుతుంది. వేదవతి వల్లికే తాళాలు అందిస్తుంది. రైస్ మిల్లు తాళాలు అందుకున్న వల్లి, ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. అందరూ వెళ్లిపోయాక వల్లి తన తల్లి భాగ్యానికి తాళాలు అందిస్తుంది. భాగ్యం ‘మనం ఏమి చేయకుండానే లక్షల లక్షలు వచ్చే రైస్ మిల్లు తాళాలు వచ్చేసాయి. ఈ దెబ్బతో మన తలరాతలు మారిపోతాయి. రామరాజు కుంగిపోయాడు.. కాబట్టి ఎప్పటికీ రైస్ మిల్ కు రాడు. నీ మొగుడు అయితే ఒక అమాయకుడు. కాబట్టి మీ నాన్నని క్యాషియర్ గా పెట్టి డబ్బు కొట్టేద్దాం. అలాగే రైస్ మిల్లు కూడా పూర్తిగా కొట్టేద్దాం’ అని భాగ్యం ఐడియా ఇస్తుంది. దీంతో ముగ్గురు సంతోషంగా డాన్సులు వేస్తూ ఆనందపడతారు. దీంతో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories