దుబాయ్ లో అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం.. టాలీవుడ్ నుంచి బన్నీకే ఫస్ట్!

First Published Mar 26, 2024, 2:35 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా దుబాయ్ కి చేరుకున్న బన్నీకి.. అక్కడ టాలీవుడ్ నుంచి ఆయన ఒక్కడే ఆ రికార్డు ను క్రియేట్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఏ స్థాయికి ఎదిగారో మనందరికీ తెలిసిందే. ‘పుష్ప’ చిత్రం తర్వాత బన్నీ అందనంత ఎత్తుకు వెళ్లారు. తన అభిమానులు మరింత గర్వపడేలా చేశారు.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

అంతే కాదు.. రీసెంట్ గా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డును కూడా బన్నీ సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే పురస్కారాన్ని అందుకున్నారు.

ఇక తాజాగా అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవాన్ని అందుకుంటున్నారు. ప్రముఖ మ్యూజిమ్ మేడమ్ టుస్కాడ్స్ లో తన మైనపు విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా బన్నీ దుబాయ్ కి చేరుకున్నారు.

కాగా, లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ లో ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబు విగ్రహాలను ఏర్పాటు చేశారు. కానీ దుబాయ్ లో సౌత్ లో ఏ స్టార్ కు ఈ గౌరవం దక్కలేదు.

కాగా మొట్టమొదటి సారిగా బన్నీ విగ్రహాన్ని దుబాయ్ లో ఆవిష్కరించబోతున్నారు. మార్చి 28న కార్యక్రమం గ్రాండ్ గా జరగనుంది. సౌత్ ఇండియాలో తొలి హీరోగా బన్నీ ఈ రికార్డు చేయడం విశేషంగా మారింది. 

అలాగే గోల్డెన్ వీసా అందుకున్న తొలి హీరో కూడా అల్లు అర్జునే కావడం గమనార్హం. ఇక అల్లు అర్జున్ నెక్ట్స్ ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule) చిత్రంలో నటిస్తుండటం విశేషం.

click me!