ఈ నేపథ్యంలో తాజాగా దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకుడిగా సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడిని పరిచయం చేయబోతున్నారు. హరికృష్ణ మనవడు, జానకీరామ్ కొడుకు ఎన్టీఆర్(నందమూర తారకరామారావు)ని హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నారు. ఇది నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఆయన సీనియర్ ఎన్టీఆర్, జూ ఎన్టీఆర్ ఉన్నారు, కొత్తగా వస్తున్న హీరోకి ఏం పేరు పెట్టబోతున్నారనే ప్రశ్నకి కాలమే నిర్ణయిస్తుందని, ఆయన నటన, సినిమాలను బట్టి ఏ పేరు పెట్టాలనేది తెలుస్తుందని, నెట్వర్క్, మేధావులు నిర్ణయిస్తారని, ప్రస్తుతానికి తాను ఆయన ఒరిజినల్ నేమ్తోనే సినిమా చేస్తున్నట్టు తెలిపారు.