సుడిగాలి సుధీర్.. టీవీ షోస్ మానేసి సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన `కాలింగ్ సహస్త్ర` మూవీ నేడు శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే తన సినిమా ప్రమోషన్స్ కోసం మళ్లీ ఈటీవీకి వచ్చాడు హైపర్ ఆది. ఇటీవల ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేశారు. ఇప్పుడు ఢీ షోకి వచ్చారు. తనదైన కామెడీతో రచ్చ చేశాడు.
అయితే ఇందులో హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్ పరువు తీశారు. నవ్వుతూనే సుధీర్ గురించి అతి పెద్ద రహస్యం బయటపెట్టాడు. ఇన్నాళ్లు `జబర్దస్త్` లో డబుల్ మీనింగ్ డైలాగ్లతో పంచ్లు, సెటైర్లు పేల్చి నవ్వించారు హైపర్ ఆది, సుధీర్. కానీ ఇద్దరికి ఏడాది గ్యాప్ వచ్చింది. సుధీర్ హీరోగా బిజీ కావడంతో `జబర్దస్త్` వదిలేశాడు. ఆది కూడా కొన్నాళ్లు ఆ షోని వీడారు. చాలా రోజులు తర్వాత ఈ ఇద్దరు కలవడంతో మళ్లీ పాత ట్రాక్ లోకి వెళ్లారు. ఇదే సమయంగా భావించిన ఆది.. సుధీర్ బండారం బయటపెట్టారు. ఫ్లో నిజాలన్నీ వెల్లడించారు.
ఇక `ఢీ` షోకి తనదైన స్టయిల్లో ఎంట్రీ ఇచ్చాడు సుడిగాలి సుధీర్. `సుధీర్ ఈజ్ బ్యాక్` అంటూ బ్యాండ్ కూడా వేసుకున్నారు. రాగానే.. ఏంటన్న ఏంచేస్తున్నావని హైపర్ ఆది అడిగారు. బాలీవుడ్ నుంచి రెండు స్టోరీస్ వచ్చాయి రా వింటున్నా అన్నాడు సుధీర్. దీనికి `నేను కూడా వింటున్నా అన్నా..అని ఏం కథలని అడగ్గా `నువ్వు చెప్పే సొళ్లు కథలు` అంటూ దిమ్మతిరిగే కౌంటర్ వేశాడు ఆది.
ఇక రావడం రావడంతోనే స్టార్ట్ చేశాడు సుధీర్. నీ దగ్గర ఏదో చిలుక ఉందట కదా. ఎక్కడుంది అని అడిగాడు. దీంతో ఆదికి ప్యూజులు ఎగిరిపోయాయి. ఎవర్రా వీడు. నువ్వు వద్దు పోరా రేయ్.. అంటే చేతులెత్తి దెండం పెట్టాడు ఆది. ఇక ఆపుకోలేక అసలు విషయం బయటపెట్టాడు ఆది. సుధీర్ బండారం బయటపెట్టాడు. ఆయన రాత్రిళ్లు ఏం చేస్తాడో మొత్తం చెప్పేశాడు. రాత్రి 10.30 వరకే `కాలింగ్ సహస్త్ర` అని.. పదిన్నర దాటిందా.. కాలింగ్ గీత, కాలింగ్ సరళ.. ఫస్ట్ కాలింగ్.. ఆ తర్వాత కూలింగ్. ఆ తర్వాత లింగడి లింగడి లింగడి.. అంటూ అసలు విషయం చెప్పాడు ఆది.
ఆ తర్వాత మరోసారి తన మార్క్ కామెడీతో రెచ్చిపోయాడు. ప్లే బాయ్ గేమ్ ఆడాడు. ఏ కలర్ మీకు కావాలని అడిగాడు సుధీర్. దీనికి యాంకర్ ప్రదీప్ పర్పుల్ అని చెప్పాడు. అరే పర్పులు అంట తెద్దాం పదా అంటూ వెళ్లబోయాడు సుధీర్. దీంతో ఆపి అరేయ్ అవి ఆ పర్పులు కావు అంటూ వివరించారు. ఇక షోలో ఓ వైపు తన విషయం బయటకు రావడంతో సుధీర్ నిర్వహకులను వేడుకున్నాడు. మళ్లీ వచ్చి తప్పు చేశాను. క్షమించమని వేడుకున్నారు. ప్రస్తుతం `ఢీ` లేటెస్ట్ ఎపిసోడ్కి చెందిన ప్రోమో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. ఇందులో ఆది, సుధీర్ మధ్య కామెడీ నవ్వులు పూయిస్తుంది.