అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీకి కూడా ఢీ షో అడ్డా అవుతోంది. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ ఢీ ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది.
ఎప్పటిలాగే హైపర్ ఆది తనదైన శైలిలో డబుల్ మీనింగ్ డైలాగులతో రెసిపోయాడు. డ్యాన్సర్ స్వేతా నాయుడుతో హైపర్ ఆది చేసిన కామెడీ వైరల్ గా మారింది. శ్వేతా తాను పాన్ ఇండియా హీరోయిన్ అవుతా అంటూ కోరిక బయట పెట్టింది. దీనితో హైపర్ ఆది ఆమె పరువు దారుణంగా తీసాడు.
పాన్ పరాగ్ ముఖం వేసుకున్నావు నువ్వేంటి పాన్ ఇండియా హీరోయిన్ అని హైపర్ ఆది సెటైర్లు వేశాడు. దీనితో శ్వేతా నాయుడు ఏం మాట్లాడలేక సిగ్గు పడిపోయింది. శేఖర్ తురాణం న భయం నసిగ్గు అని హైపర్ ఆది అంటాడు. దీనితో యాంకర్ నందు కామా తురాణం అంటాడు.
రెండూ ఒకటే లే అని హైపర్ ఆది చెప్పడంతో అంతా నవ్వులు పూశాయి. శేఖర్ మాస్టర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఫన్నీగా ఉంది. హైపర్ ఆది దుబాయ్ షేక్ గెటప్ అలరించాడు.
ఇక డ్యాన్స్ కంటెస్టెంట్స్ మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. శేఖర్ మాస్టర్, ప్రణీత జడ్జీలుగా ఇంటెన్స్ గా కనిపించారు. కొందరు డ్యాన్సర్లని మందలించారు. ఎలిమినేషన్ ప్రక్రియ చాలా ఉత్కంఠగా సాగింది, ఏ డ్యాన్సర్ ఎలిమినేట్ అవుతున్నారనేది ఈ ఎపిసోడ్ లో తేలనుంది.
నటుడు సత్యదేవ్ ఈ ఎపిసోడ్ కి అతిథిగా హాజరయ్యారు. మట్టాలన్నాక మాసిపోవడం.. మనిషన్నాకా మోసపోవడం సహజం అంటూ సత్యదేవ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. గబ్బర్ సింగ్ పాటకి సరదాగా డ్యాన్స్ కూడానా చేశారు.