భర్తతో ఆమని విడిపోవడానికి కారణం ఇదే.. విడాకుల వెనుక ఆసలేం జరిగిందో చెప్పిన సీనియర్‌ నటి..

Published : Apr 27, 2024, 12:49 PM ISTUpdated : Apr 27, 2024, 05:51 PM IST

తెలుగు తెరపై ఇల్లాలు పాత్రలకు పెట్టింది పేరుగా మెప్పించిన ఆమని.. తన భర్తకి దూరంగా ఉంటుంది. ఈ ఇద్దరు విడిపోయారు. తాజాగా దానికి కారణం ఏంటో బయటపెట్టింది ఆమని.   

PREV
17
భర్తతో ఆమని విడిపోవడానికి కారణం ఇదే.. విడాకుల వెనుక ఆసలేం జరిగిందో చెప్పిన సీనియర్‌ నటి..

తెలుగు నటి ఆమని ఎన్నో ఫ్యామిలీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైంది. ఇల్లాలు పాత్రలతో మెప్పించిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెరుస్తుంది. చాలా అరుదుగా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు మరిన్ని సినిమాలు చేయడానికి రెడీ గా ఉంది. అవకాశాల కోసం వెయిట్‌ చేస్తుంది. 

27

ఇదిలా ఉంటే ఆమని ఎన్నో ఫ్యామిలీ సినిమాల్లో నటించింది. ఇల్లాలుగా ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎలా ఉండాలనే విషయాలను తన సినిమాల ద్వారా తెలియజేస్తుంది. ఉత్తమమైన వెండితెర ఇల్లాలుగానూ పేరు తెచ్చుకుంది. సినిమాల్లో ఫ్యామిలీని నిలబెట్టుకునేందుకు ఎంతైనా పోరాడే పాత్రలు చేసి మెప్పించింది. 
 

37

కానీ రియల్‌ లైఫ్‌లో తన వైవాహిక బంధం ఎక్కవ కాలం నిలవలేదు. ఆమని లేట్‌గానే పెళ్లి చేసుకుంది. ఆమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మోహియుద్దీన్‌ ని పెళ్లిచేసుకుంది. వీరిది ప్రేమ పెళ్లి కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. ఇద్దరు కలుసుకున్నారు. అభిప్రాయాలు కలిశాయి. మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరికి కొడుకు, కూతురు కూడా ఉన్నారు. 

47

పెళ్లైన ప్రారంభంలో సినిమాలకు దూరమైంది ఆమని. భర్తకి ఇష్టం లేకపోవడంతో ఆమె సినిమాలు మానేసింది. చాలా కాలం తర్వాత మధ్య మధ్యలో ఒకటి అర మూవీస్‌ చేస్తూ వచ్చింది. అయితే తనకు సినిమాలంటే ఇష్టం, ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఇద్దరు విడిపోయారు. ఒక అండర్‌ స్టాండింగ్‌తోనే విడిపోయినట్టు చెప్పింది ఆమని. ఫ్రెండ్లీగానే తామిద్దరం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్ని విడిపోయినట్టు తెలిపింది. 
 

57

అయినా ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నారని, కలుస్తుంటారని తెలిపారు. డైవర్స్ చాలా హెల్దీగా జరిగినట్టు తెలిపింది. అయితే పిల్లల బాధ్యత మాత్రం తానే తీసుకుందట. వారే తన ప్రపంచంలా బతికేస్తున్నట్టు తెలిపింది ఆమని. సినిమాల షూటింగ్‌ల వల్ల వారి పేరెంటింగ్‌ కాస్త ఇబ్బంది అవుతుందని, కానీ మ్యానేజ్‌ చేస్తున్నామని తెలిపారు. కానీ దూరంగా ఉండటం వల్ల పిల్లలు తమని మిస్‌ అవుతున్నట్టు పేర్కొంది. 
 

67

అయితే ఈ సందర్భంగా ఓ ఆరోపణపై ఆమె స్పందించింది. భర్త అప్పులపాటు కావడంతో సెకండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఆమని అనే పుకార్లపై స్పందిస్తూ, అది నిజం కాదని తెలిపింది. అప్పులు తీరిపోయాయని, ఆ సమస్య లేదని తెలిపింది. ఒకప్పుడు తానే సినిమాలు మానేశానని, ఇప్పుడు తానే చేస్తున్నాని తెలిపింది ఆమని. ఇప్పుడు ఎవరికి వారు బిజీగా ఉన్నామని, దీంతో విడిగా ఉండాలని నిర్ణయించుకుని విడిపోయినట్టు తెలిపింది ఆమని. విడాకులు తీసుకోలేదని, కానీ దూరంగా ఉంటున్నామన్నారు.
 

77

తమిళ చిత్రాలతో కెరీర్‌ ని ప్రారంభించిన ఆమని `జంబ లకిడి పంబ` మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత `మిస్టర్ పెళ్లాం`లో హీరోగా నటించి ఆకట్టుకుంది. నంది అవార్డుని అందుకుంది. `కన్నయ్య కిట్టయ్య`, `శుభ లగ్నం`, `హలో బ్రదర్‌`, `అమ్మదొంగ`, `ఘరానా బుల్లోడు`, `శుభ సంకల్పం`, `వంశానికొక్కడు`, `మావిచిగురు`, `ఆ నలుగురు`, `దేవస్థానం`, `చందమామ కథలు` వటి చిత్రాలతో మెప్పించింది. ఇప్పుడు కూడా అడపాదడపా చిత్రాలతో మెప్పిస్తుంది. సీరియల్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories