డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిన త్రిష, పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో సీనియర్ హీరోయిన్

First Published Nov 24, 2022, 11:14 PM IST

చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న త్రిష.. ఇక జోరు పెంచింది. పొన్నియన్ సెల్వన్ పార్ 1 తో త్రిషకు మళ్ళీ ఊపు వచ్చింది. ఈసినిమాలో ఈమె పాత్రకు మంచి పేరు రావడంతో..వరుసగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈక్రమంలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలరించనుంది బ్యూటీ. 

మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది సౌత్‌ స్టార్‌ త్రిష. రీసెంట్ గా మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ 1 సూపర్ సక్సెస్ అవ్వడంతో  ఆమె క్రేజ్‌ మరింత పెరిగింది. ప్రస్తుతం తమిళంలో మూడు, మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నదీ తార. సినిమాలతో పాటు డిజిటల్‌ ఎంట్రీకి కూడా త్రిష సిద్ధమైంది. 
 

Trisha

పొన్నియన్ సెల్వన్ లో త్రిష పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తరువాత హీరోయిన్ గా మళ్లీ బిజీ అయిపోతోంది త్రిష. ముఖ్యంగా తళపతి విజయ్ సినిమాలో హీరోయిన్ గా ఆమెకు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సి నిమాతో పాటు మరికొన్ని ఆఫర్లు ఆమె తలుపు తట్టాయని సమాచారం. 

ఇక త్రిష డిజిటల్ ఎంట్రీకి కూడా రెడీ అయ్యింది. ఆమె నటిస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ బృందా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.  ఈ సిరీస్‌ తెలుగులో తెరకెక్కి మిగతా సౌత్ భాషలన్నింటిలోకి డబ్బింగ్ కాబోతోంది.  ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిన ఈ సిరీస్ ను  సూర్య వంగల  రూపొందిస్తున్నారు. 
 

ఇక ఈ సిరిస్ లో త్రిష పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. ఫస్ట్ టైమ్ త్రిష ఇలాంటి పాత్రను చేసింది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలో పాటు థ్రిల్లర్ క్యారెక్టర్స్ చేసిన త్రిష.. యాక్షన్ సీన్స్ ఎలా చేస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక డిజిటల్ ఎంట్రీ సందర్భంగా.. బృందా పార్ట్‌ 1 షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా త్రిష సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. బృందా షూటింగ్‌ పూర్తిచేశాం. షూటింగ్ కు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాను అంటూ ఇన్‌స్టాలో తెలిపింది. 
 

ప్రస్తుతం త్రిష  సతురంగ వేైట్టె 2, ద రోడ్‌, పొన్నియన్‌ సెల్వన్‌ 2, రామ్‌ పార్ట్‌ 1  సినిమాల్లో నటిస్తుంది. హీరోయిన్ గా మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి కూడా వరసు సినిమాలు ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి. 

click me!