ఆదితో నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, బిగ్ బాంబు పేల్చిన శ్రద్దా... పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా!

First Published Oct 13, 2022, 4:03 PM IST

ఢీ రియాలిటీ షో వేదికగా హీరోయిన్ శ్రద్దా దాస్ షాకింగ్ సీక్రెట్ బయటపెట్టారు. ఆమెకు హైపర్ ఆదితో ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందని చెప్పి మైండ్ బ్లాక్ చేసింది. 35 ఏళ్ల శ్రద్దా సింగిల్ గా ఉంటున్న విషయం తెలిసిందే..

Shraddha das

హీరోయిన్ శ్రద్దా దాస్ సింగిల్ గా ఉంటున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేకున్నా పెళ్లి మాటెత్తడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. నిలువెత్తు అందాల శ్రద్దా దాస్ కి కాలం కలిసి రాలేదు. ఆమెకు బ్రేక్ ఇచ్చే ఒక్క ఆఫర్ తగల్లేదు.

Shraddha das

తాజాగా శ్రద్దా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పి షాక్ ఇచ్చింది. డాన్స్ రియాలిటీ షో ఢీ 14 జడ్జిగా శ్రద్దా దాస్ వ్యవహరిస్తున్నారు. ప్రియమణి పెద్దగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో శ్రద్దా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ జడ్జెస్ట్ గా పూర్ణ, శ్రద్దా దాస్, యాని మాస్టర్ వ్యవహరించారు. 
 

Shraddha das

పూర్ణ వస్తూ వస్తూనే తన మార్క్ చూపించింది. ఆమె బుగ్గలు కొరికే కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఒక మేల్ కంటెస్టెంట్ గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాశావు... సాంగ్ కి పెర్ఫార్మ్ చేశాడు. అతడి డాన్స్ కి ఇంప్రెస్ అయిన పూర్ణ పిలిచి ముద్దు ఇచ్చింది. అలాగే బుగ్గ కూడా కొరికింది. దాంతో సదరు కంటెస్టెంట్ ఫిదా అయ్యాడు. మిగతా వాళ్ళు కుళ్లుకున్నారు. 
 

Shraddha das

అనంతరం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జడ్జి సీటులో ఉన్న శ్రద్దా దాస్ తనకు హైపర్ ఆదితో ఎంగేజ్మెంట్ అయినట్లు చెప్పారు. అనంతరం హైపర్ ఆదిపై పూలు జల్లుకుంటూ శ్రద్దా వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఇద్దరిపై పూలు జల్లుతూ శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరికీ వేడుక జరిపారు.

Shraddha das

శ్రద్దా కమెడియన్ హైపర్ ఆదితో ఎంగేజ్మెంట్ జరిగిందని ఏ అర్థంలో చెప్పిందో తెలియాలంటే వచ్చే వారం ఎపిసోడ్ చూడాలి. ఆమె మాటల్లో ఉన్న నిజం ఏమిటో ఆదివారం తేలిపోనుంది. అలాగే ఈ షోలో హైపర్ ఆదిని మధ్యలో ఉంచి ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ హాట్ హాట్ స్టెప్స్ తో హీటెక్కించారు.

Shraddha das

ఢీ 13వరకు యాంకర్స్ గా సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ కొనసాగారు. వారిద్దరూ ఉన్నప్పుడు ఈ షో రికార్డు రేటింగ్ రాబట్టింది. కారణం తెలియదు కానీ... సుధీర్,రష్మీలను ఢీ 14 నుండి తొలగించారు. సుధీర్ అయితే ఏకంగా ఈటీవీని వదిలేసి వెళ్ళిపోయాడు. రష్మీ జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కొనసాగుతున్నారు. 
 

click me!