కాగా ఇటీవల డీప్ ఫేక్ వీడియో సాంకేతికతను పలువురు హీరోయిన్స్ బాధితులు అయ్యారు. రష్మిక మందాన, కాజోల్, ప్రియాంక చోప్రా, నోరా ఫతేహి వంటి హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రష్మిక డీప్ ఫేక్ వీడియో పై విచారణ జరిగింది. అందుకు కారణమైన యువకుడిని చాలా రోజుల అనంతరం అరెస్ట్ చేశారు.
తాజాగా ప్రగ్య నగ్ర బాధితురాలిగా మారారు. ఆమె సైబర్ క్రైం విభాగంలో ఫిర్యాదు చేశారు. ఫేక్, మార్ఫ్డ్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.