నివేద పేతురాజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్. ఈ చెన్నై భామ మెంటల్ మదిలో చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం సాయి ధరమ్ తేజ్ కి జంటగా చిత్రలహరి మూవీ చేసింది.
బ్రోచేవారెవరురా చిత్రంతో క్లీన్ హిట్ అందుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మంచి విజయం సాధించింది. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నివేద థామస్ ఇతర ప్రధాన పాత్రలు చేశారు. అనూహ్యంగా అల వైకుంఠపురంలో చిత్రంలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది.
అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్. అయితే నివేద పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. దాంతో ఆ చిత్ర విజయం ఆమెకు మేలు చేసింది లేదు. రెడ్, పాగల్, విరాటపర్వం, దాస్ కా ధమ్కీ... ఇలా పలు తెలుగు చిత్రాలు చేసింది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది.
Nivetha Pethuraj
ఇటీవల నివేద పేతురాజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వీడియోలో... పోలీసులు ఆమె కారును అడ్డగించారు. కారు చెక్ చేయాలని, డిక్కీ ఓపెన్ చేయాలని ఆమె కోరారు. అందుకు నివేద నిరాకరించింది. పరువుకు సంబంధించిన విషయం, కారు డిక్కీ ఓపెన్ చేయడం కుదరని ఆ వీడియోలో నివేద పోలీసులతో అన్నారు. అప్పటికీ పోలీసులు పట్టుబట్టడంతో వీడియో తీస్తున్న ఫోన్ విసిరేసి దురుసుగా ప్రవర్తించింది.
ఈ వీడియో నిజమని నమ్మిన పలువురు నెగిటివ్ కామెంట్స్ చేశారు. నిజానికి ఇది ఫ్రాంక్ వీడియో. కొత్తగా ఆమె నటించిన పరువు అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం చేసింది. ఈ ప్రమోషనల్ వీడియో నివేద పేతురాజ్ కి చాలా చిక్కులే తెచ్చిపెట్టిందట. తాజా ఇంటర్వ్యూలో ఈ వీడియో పై ఆమె స్పందించారు.
పరువు ప్రమోషనల్ వీడియో ఇంత నెగిటివ్ గా వెళుతుందని నేను ఊహించలేదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుండి నాకు కాల్స్ వచ్చాయి. నిజంగా పోలీసులతో గొడవ పడ్డావా? అని అడిగారు. పరువు యూనిట్ సభ్యులకు కాల్ చేసి కనీసం టైటిల్ విడుదల చేయండని వేడుకున్నాను. ఆ నెక్స్ట్ డే టైటిల్ రిలీజ్ చేశారు. మరోసారి ఇలాంటి ప్రమోషనల్ వీడియో చేయకూడదని ఫిక్స్ అయ్యాను... అని నివేద పేతురాజ్ అన్నారు.
Nivetha Pethuraj
పరువు వెబ్ సిరీస్ నిర్మాత చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కావడం విశేషం. మరి ఈ ప్రమోషనల్ ప్లాన్ ఎవరిదో కానీ నివేద పేతురాజ్ విమర్శలపాలైంది. గతంలో కూడా ప్రమోషన్స్ కోసం చేసిన ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు తప్పుదారి పట్టాయి. అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ చేసిన పని నెగిటివిటీ మూటగట్టుకుంది. పబ్లిక్ లో న్యూసెన్స్ అని జనాలు మండిపడ్డారు.