Keerthy Suresh
అమ్మాయిలకు సమాజంలో భద్రత లేదు. కోట్ల మంది చేత అభిమానించబడే హీరోయిన్స్ కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. కాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తనకు గతంలో ఎదురైన ఓ షాకింగ్ సంఘటన పంచుకున్నారు. నడిరోడ్డులో తనకు ఒక చేదు అనుభవం ఎదురైందని చెప్పారు.
సీనియర్ హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. తల్లి వారసత్వాని నిలబెడుతూ స్టార్ గా ఎదిగింది. మహానటి కీర్తి సురేష్ కి బ్రేక్ ఇచ్చింది.ఇక వరుస విజయాలతో జోరు మీదున్న కీర్తి సురేష్ కి భోళా శంకర్ రూపంలో ప్లాప్ పడింది. చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ అనూహ్యంగా చెల్లెలు పాత్ర చేసింది. దర్శకుడు మెహర్ రమేష్ నిరాశపరచగా కీర్తి సురేష్ పాత్ర కూడా తేలిపోయింది.
భోళా శంకర్ మూవీలో చెల్లి పాత్ర కోసం మొదట సాయి పల్లవిని అనుకున్నారు. సాయి పల్లవికి స్క్రిప్ట్ నచ్చక చేయను అన్నారు. స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉండి కూడా కీర్తి సురేష్ భోళా శంకర్ మూవీ ఒప్పుకుంది. ఫస్ట్ షో నుండే బ్యాడ్ టాక్ తెచ్చుకున్న భోళా శంకర్ యాభై కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది.
అయితే తమిళ చిత్రం మామన్నన్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో నాయకుడిగా విడుదలైంది. ఈ మూవీలో కీర్తి హీరోయిన్ గా నటించింది. ఉదయనిధి స్టాలిన్ కి ఇక్కడ మార్కెట్ లేదు. అందుకే పెద్దగా ఆడలేదు.
అలాగే తెలుగులో ఆమె నటించిన సర్కారు వారి పాట, దసరా భారీ విజయాలు నమోదు చేశాయి. దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని కెరీర్లో దసరా బిగ్గెస్ట్ హిట్. దసరా మూవీ కీర్తి సురేష్ కి మరోసారి మంచి పేరు తెచ్చిపెట్టింది. వెన్నెల పాత్రలో కీర్తి ఒదిగిపోయి నటించింది.
Keerthy suresh
ప్రస్తుతం పలు భాషల్లో అరడజను సినిమాల వరకు కీర్తి చేస్తున్నారు. బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తుంది. వరుణ్ ధావన్ కి జంటగా ఓ చిత్రం చేస్తుంది. కాగా కీర్తి సురేష్ గతంలో లైంగిక వేధింపులు గురయ్యారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించాడు.