నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తా... అనుమప పరమేశ్వరన్ కీలక వ్యాఖ్యలు!

First Published Jun 4, 2023, 10:52 AM IST

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉంటానంటూ కుండబద్దలు కొట్టారు. 

అనుపమ పరమేశ్వన్ మాట్లాడుతూ... ఎమోషన్స్ వ్యక్తీకరించే విషయంలో నేను నిజాయితీగా ఉంటాను. ఏదైనా విషయం నచ్చకపోతే డైరెక్ట్ గా చెప్పేస్తాను. మన జీవితం చాలా చిన్నది. మన టైం అయిపోగానే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈ కొద్ది సమయంలో ఒత్తిడిని తీసుకోవాల్సిన అవసరం లేదు. సీసీ టీవీ ఫుటేజ్ డిలీట్ అయినట్లు నా మెదడులో చెత్త ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది,అని  అనుపమ అన్నారు. 


ఇక అనుపమ కెరీర్ పరిశీలిస్తే.. కార్తికేయ 2 తో ఒక్కసారిగా ఫార్మ్ లోకి వచ్చింది.కెరీర్ ప్రమాదంలో పడగా భారీ హిట్ తో మైలేజ్ తెచ్చుకుంది. నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 వంద కోట్ల మార్క్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి.  హిందీలో ఈ మూవీ విజయం సాధించడం మరో విశేషం.

పెద్ద హీరోల చిత్రాలకు షాక్ ఇస్తూ కార్తికేయ 2 ఊహించిన వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2 దాదాపు రూ. 30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ విజయాన్ని టీమ్ భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు . 


 అయితే కార్తికేయ 2 అనంతరం విడుదలైన 18 పేజెస్ కమర్షియల్ గా ఆడలేదు. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ లో ఆడకున్నా ఓటీటీ హక్కులతో 18 పేజెస్ ప్రాఫిట్ వెంచర్ గా మిగిలినట్లు సమాచారం. 

Anupama Parameswaran

కాగా బటర్ ఫ్లై టైటిల్ తో అనుపమ ఒక ఓటీటీ మూవీ చేశారు. అది కూడా నిరాశపరిచింది. కార్తికేయ 2 అనంతరం ఆమెకు రెండు ప్లాప్స్ పడ్డాయి. ప్రస్తుతం ఒక మలయాళం, ఒక తమిళ చిత్రంలో అనుపమ నటిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అనుపమ గ్లామర్ షో హద్దులు దాటేస్తుంది. 

click me!