`ఖుషి` చిత్రం పాజిటివ్ టాక్తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే నైజాం, ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఆంద్ర, సీడెడ్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. తమిళనాడులో ఈ చిత్రం పది కోట్ల వరకు కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. అయితే భారీ వర్షాలు, `జవాన్`, `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రాల ప్రభావం ఈ చిత్రంపై పడింది. ఇప్పటి వరకు ఈ చిత్రం సుమారు రూ.90కోట్ల గ్రాస్ సాధించిందని తెలుస్తుంది.