
Rajasekhar: డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారనేది సినిమాల్లో వినిపించే రొటీన్ డైలాగ్. కానీ డాక్టర్ అయిన తర్వాత హీరో అయ్యాడు రాజశేఖర్. ఆయన తమిళంలో హీరోగా కెరీర్ ప్రారంభించి `ప్రతిఘటన` సినిమాతో 1985లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రారంభంలో విజయశాంతితో కలిసి ఎక్కువ సినిమాలు చేసి మెప్పించారు. `వందేమాతరం`, `రేపటి పౌరులు` వంటి సినిమాలు చేశారు.
`తలంబ్రాలు` సినిమాలో జీవితతో కలిసి నటించాడు రాజశేఖర్. వీరికిది తొలి మూవీ. ఈ సినిమాతోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమ చిగురించి, పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఈ మూవీ కంటే ముందే మరో సినిమాలో ఇద్దరు జోడీ కట్టాల్సింది.
ఓ రోజు షూటింగ్లో కూడా పాల్గొన్నారు. కానీ సడెన్గా రాజశేఖర్ని తీసేశారు. అయితే ముందు ఇందులో హీరోయిన్గా జీవితని తీసేయమన్నాడు రాజశేఖర్. కట్ చేస్తే నెక్ట్స్ డే ఆయన్నే హీరోగా తీసేశారు. మరి ఇంతకి ఏం జరిగింది? ఆ మూవీ ఏంటనేది చూస్తే.
రాజశేఖర్ ప్రారంభంలో రెండు మూడు తమిళ సినిమాలు చేశారు. అందులో భాగంగా `హాలో యార్ పెసురతు` అనే మూవీలో రాజశేఖర్ మొదట హీరోగా ఎంపికయ్యారు. దీనికి అప్పట్లో హీరోగా రాణిస్తున్న రామరాజన్ దర్శకుడు. హీరోయిన్గా జీవితని ఎంపిక చేశారు. ఆమె మొదటి రోజు షూటింగ్ రాలేదు. రెండో రోజు షూటింగ్ కి వచ్చింది. బాగా జ్వరంతో వణికిపోతుంది.
రాజశేఖర్ డాక్టర్ కావడంతో ఆమెని చూసి ట్రీట్మెంట్ ఇచ్చాడు. కాస్త రిలాక్స్ అయ్యింది. కానీ సినిమాలో హీరోయిన్ది గ్లామర్ రోల్. కానీ జీవిత చాలా హోమ్లీగా కనిపిస్తుంది. ఈమె ఎలా సెట్ అవుతుంది, కష్టమే అనే భావనతో రాజశేఖర్ ఉన్నారు.
అయితే ముందు రోజు రాజశేఖర్పై షూటింగ్ చేశారు రామరాజన్. ఆయన ఎలా చేయాలో చెప్పారట, కానీ రాజశేఖర్ అలా చేయడం లేదు, తనకు నచ్చినట్టు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కో సీన్కి పదికిపైగా టేకులు తీసుకుంటున్నాడట. రెండో రోజు జీవితతో సీన్ల విషయంలోనూ అదే జరిగింది.
ఆ రోజు షూటింగ్ అయిపోయాక దర్శకుడు రామరాజన్ వచ్చి ఏంటి డాక్టర్ గారు హీరోయిన్ ఎలా ఉంది? అని అడిగాడు. రాజశేఖర్ స్పందిస్తూ హీరోయిన్ కష్టం సార్, పాత్ర గ్లామర్గా ఉంది, అమ్మాయి హోమ్లీగా కనిపిస్తుంది, కష్టం హీరో్యిన్ ని మార్చేయండి అన్నాడట. డైరెక్టర్, నిర్మాతతో డిస్కషన్ జరిగింది. అంతా ఓకే అనుకున్నారు.
ఆ రోజు షూటింగ్ అయిపోయింది. నెక్ట్స్ డే షూటింగ్ లేదు. మరో నాలుగు రోజుల తర్వాత షూటింగ్ ఉంటుంది, బండి పంపిస్తాం వచ్చేయండి అన్నారట దర్శక, నిర్మాతలు. కానీ నాలుగు రోజులు కాదు కదా, పది రోజులైనా బండి రాలేదు. ఏం జరిగిందని కనుక్కుంటే హీరోనే మార్చేశారని తెలిసింది.
దీంతో తాను షాక్కి గురయినట్టు తెలిపారు రాజశేఖర్. అలీతో సరదాగా టాక్ షోలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ మూవీలో రాజశేఖర్ పాత్రలో అప్పటి హీరో సురేష్ని తీసుకున్నారు.
1985లో ఈ మూవీ విడుదలైంది. బాగానే ఆడింది. కానీ అదే ఏడాది రాజశేఖర్ తెలుగులో `ప్రతిఘటన`, `వందేమాతరం` వంటి బిగ్ బ్లాస్టర్స్ లో భాగమయ్యాడు, ఇక్కడ హీరోగా నిలబడిపోయారు. వరుసగా ఆఫర్లు అందుకున్నారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
రాజశేఖర్ ప్రస్తుతం హీరోగా రాణించేందుకు స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన మూడేళ్ల క్రితం `శేఖర్`మూవీలో నటించారు. ఇది ఆడలేదు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండేళ్ల క్రితం `ఎక్స్ ఆర్డినరీ మ్యానర్` చిత్రంలో నితిన్తో కలిసి నటించారు. ఈ మూవీ ఆడలేదు. దీంతో మళ్లీ క్యారెక్టర్స్ చేయడం లేదు. ఇప్పుడు శర్వానంద్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.
read more: సాయి పల్లవి బెస్ట్ డాన్సర్ అవ్వడానికి కారణం అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ కోరిక తీరిపోయిందట!
also read: దేశంలోనే వేల కోట్ల అధిపతి వలలో ఐశ్వర్య రాయ్! ఎవరా కుబేరుడు?, ఏం జరిగింది?