విడాకుల వార్తలపై ఫస్ట్ టైమ్‌ స్పందించిన నిఖిల్‌.. అదిరిపోయే కౌంటర్‌.. తన వైఫ్‌ రియాక్షన్‌కి షాక్‌..

First Published Dec 19, 2022, 12:04 PM IST

`కార్తికేయ2`తో రికార్డులు క్రియేట్‌ చేసిన యంగ్‌ హీరో నిఖిల్‌ ఆ మధ్య ఫ్యామిలీ విషయంలో వార్తల్లో నిలిచారు. డైవర్స్ తీసుకోబోతున్నారనే న్యూస్‌ వచ్చిన నేపథ్యంలో తాజాగా స్పందించారు. `ఏషియానెట్‌`తో స్పెషల్‌ చిట్‌చాట్ తో ఆసక్తికర కామెంట్ చేశారు. 

నిఖిల్‌ (Nikhil Siddharth) ఇప్పుడు పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు. `కార్తికేయ2` సినిమా సంచలన విజయం ఆయనకు స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఆయన పలు నెగటివ్‌ రూమర్స్ ని ఫేస్‌ చేయాల్సి వచ్చింది. ఆ మధ్య తాను భార్యతో విడిపోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇద్దరూ విడిగా ఉంటున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపించాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై నిఖిల్‌ స్పందించలేదు. 

నిఖిల్‌ నటించిన `18 పేజెస్‌`(18 Pages) మూవీ ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన తాజాగా `ఏషియా నెట్‌ తెలుగు`తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ట్రోల్స్, మీమ్స్ పై ఆయన రియాక్ట్ అయ్యారు. అందులో భాగంగానే తనపై వచ్చిన డైవర్స్ రూమర్స్ పై అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారు. డైవర్స్ వార్తలు చూసి తాను ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. స్టుపిడ్‌గా అనిపించిందని, వాటిని చూసి నవ్వుకున్నానని తెలిపారు.  నేను, నా వైఫ్‌(పల్లవి వర్మ) చాలా హ్యాపీగా ఉన్నామని తెలిపారు. 
 

ఈ విషయం తన భార్యతో చెప్పగా ఆమె రియాక్షన్‌ షాకిచ్చిందన్నారు. మనం ఏదైనా ఫోటో పెట్టి వీటికి ఫుల్‌ స్టాప్‌ పెడదామా అని తనతో అనగా, `డూడ్‌ ఏం చెబుతున్నావ్‌. మనం ఎలా ఉన్నామో మనకు తెలియదా? వాటికి ఎందుకు రియాక్ట్ కావాలి` అని తనకే చెప్పిందని, అది తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇలాంటి రూమర్స్ చాలా ఫన్నీగా ఉంటాయని చెప్పారు, ట్రోల్స్, మీమ్స్ ని చూసి తాను చాలా ఎంజాయ్‌ చేస్తానని, ఫన్నీగా తీసుకుంటానని వెల్లడించారు. 
 

ఈ సందర్భంగా మీడియా వాళ్లకు సలహాలిచ్చారు. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కొంచెం చెక్‌ చేసుకుంటే బాగుంటుందని, లేదంటే అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్‌ అవుతున్నారు. మీమర్స్ ని ఆకాశానికి ఎత్తేసిన నిఖిల్‌.. యూట్యూబ్‌ వీడియోలపై ఘాటుగా స్పందించారు. బయటకు ఓ రకంగా థంబ్‌నెయిల్‌ పెడుతున్నారని, లోపల అసలు కంటెంటే ఉండటం లేదన్నారు. అవి చాలా దారుణంగా ఉంటున్నాయని వెల్లడించారు. దీనిపై ఎవరైనా యాక్షన్‌ తీసుకోవాలని, కనీసం సెన్సార్‌ అయినా ఉండాలని తెలిపారు. 
 

తన వైఫ్‌ చాలా సపోర్టివ్ అని, తన సినిమాలకు సంబంధించిన మంచి రివ్యూ ఇస్తుందని తెలిపారు. టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్ అన్నీ ఆమెకి పంపిస్తానని, మంచి రివ్యూ ఇస్తుందన్నారు. అలాగే ప్రతి రోజు షూటింగ్‌ అయిపోయాక ఆ విషయాలను తనతో చర్చిస్తానని తెలిపారు. ఆమెతో పంచుకోపోతే తనకు తోయదని వెల్లడించారు. నిఖిల్‌ రెండేళ్ల క్రితం(2020) మే 14న డాక్టర్‌ పల్లవి వర్మని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. లాక్‌ డౌన్‌ సమయంలో వీరి వివాహం జరిగింది. ప్రేమించిన అమ్మాయిని నిఖిల్‌ సొంతం చేసుకున్నారు.

తన స్ట్రగులింగ్‌ లైఫ్‌, ఫెయిల్యూర్‌ కెరీర్‌ గురించి చెబుతూ, ఫెయిల్‌ వచ్చినప్పుడు తనలో రెట్టింపు కసి పెరుగుతుందని, సినిమా పోయిందని డిప్రెషన్‌ ఫీలవడమనేది జరగదని, ఆ బాధతో లోపలు దిగమింగి కసిగా మరో సినిమా చేయాలని, హిట్‌ కొట్టాలనే ఉద్దేశంతో ఉంటానని తెలిపారు. నెక్ట్స్ సినిమాల లైనప్‌ తెలిపారు నిఖిల్‌. ప్రస్తుతం `స్పై` అనే రా ఏజెంట్ మూవీ  చేస్తున్నానని, పూర్తి యాక్షన్‌ మూవీ అని, నేషనల్‌ పాయింట్‌తో నెవర్ బిఫోర్‌ లా ఉండే కథతో రాబోతున్నట్టు తెలిపారు. ఆ తర్వాత సుధీర్‌ వర్మతో మరో సినిమా చేస్తున్నానని తెలిపారు. `ఇండియా హౌజ్‌` అనే ఫిల్మ్ చేస్తున్నానని, ఓ పీరియాడిక్‌ మూవీ ఉందన్నారు. రాబోతున్న వాటిలో చాలా ఎగ్జైటింగ్‌ స్టఫ్‌ ఉందన్నారు.
 

నిఖిల్‌ `18పేజెస్‌` చిత్రంతో రాబోతున్నారు. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. `కుమారి 21 ఎఫ్‌` ఫేమ్‌ పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో సుకుమార్‌ రైటింగ్స్ నుంచి, గీతా ఆర్ట్స్ బ్యానర్ల నుంచి రాబోతున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఓ క్రేజీ లవ్‌ స్టోరీతో ఈ సినిమా రాబోతుందని చెప్పారు నిఖిల్‌. గతంలో ఎప్పుడూ చూడని లవ్‌ స్టోరీని ఇందులో చూడొచ్చని, అది కనెక్ట్ అయితే సినిమా రేంజ్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందన్నారు. 

click me!