గతంలో తన ప్రాజెక్ట్ పక్కనపెట్టి మహేష్(Mahesh babu) తో మూవీ చేసిన పరుశురాం పై నాగ చైతన్య గుర్రుగా ఉన్నాడని, అందుకే ఆయన ఇలాంటి కామెంట్స్ చేశాడు అంటున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. టూ టైర్ హీరోలు కూడా ఒకటికి రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకొని ఉన్నారు. కాబట్టి పరుశురాం కి నిరీక్షణ తప్పేలా లేదు. మొత్తంగా సర్కారు వారి పాట దర్శకుడు పరుశురాం కొంపముంచింది అంటున్నారు.