కాగా మోక్షజ్ఞను స్వయంగా బాలకృష్ణ తన దర్శకత్వంలో పరిచయం చేయాలని అనుకున్నారు. బాలకృష్ణ కెరీర్లో కల్ట్ క్లాసిక్ గా ఉన్న ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ మోక్షజ్ఞతో చేయాలని బాలకృష్ణ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కథ కూడా బాలకృష్ణనే రాసుకున్నాడు. బాలకృష్ణ బిజీగా ఉండటంతో పాటు రిస్క్ ఎందుకని, ఫస్ట్ మూవీ ఫార్మ్ లో ఉన్న ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు.
తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ఆదిత్య 999 మ్యాక్స్ కి ఏర్పాట్లు మొదలుపెట్టాడట. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. బాలకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మనిషి కాలంలో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? భూత భవిష్యత్ కాలాల్లోకి వెళ్లగలిగితే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? తెలియజేశాడు.