రాజధాని ఫైల్స్ మూవీ ఆపడానికి కారణాలు ఇవేనా..ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఎలాంటి సీన్లు ఉన్నాయంటే

First Published Feb 16, 2024, 10:18 AM IST

ఏపీ పాలిటిక్స్ నేపథ్యంలో గురువారం రాజధాని ఫైల్స్ అనే చిత్రం విడుదలైంది. జగన్ ప్రభుత్వం వచ్చాక అమరావతి రాజధాని విషయంలో ఎలాంటి వివాదం చోటుచేసుకుందో తెలిసిందే. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతి రాజధాని ప్రకటించారు. జగన్ వచ్చాక మూడు రాజధానులు అని ప్రకటించడంతో అమరావతి ప్రాంతంలో రైతులు తీవ్ర ఉద్యమం చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపించే కొద్దీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చిత్రాలు ఎక్కువవుతున్నాయి. ఆల్రెడీ మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర 2 చిత్రం విడుదలయింది. ఈ చిత్రంలో నేరుగా వైఎస్ జగన్ పాత్రని హైలైట్ చేస్తూ.. ఆయన చేసిన పాదయాత్ర, కేసులు ఎదుర్కొన్న విధానం లాంటి అంశాలని చూపించారు. మరోవైపు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కూడా జగన్ ని హైలైట్ చేస్తూ పరోక్షంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పాత్రలపై సెటైర్లు వేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

అయితే ఏపీ పాలిటిక్స్ నేపథ్యంలో గురువారం రాజధాని ఫైల్స్ అనే చిత్రం విడుదలైంది. జగన్ ప్రభుత్వం వచ్చాక అమరావతి రాజధాని విషయంలో ఎలాంటి వివాదం చోటుచేసుకుందో తెలిసిందే. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతి రాజధాని ప్రకటించారు. జగన్ వచ్చాక మూడు రాజధానులు అని ప్రకటించడంతో అమరావతి ప్రాంతంలో రైతులు తీవ్ర ఉద్యమం చేపట్టారు. ఇప్పటికీ రాజధాని అంశం రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బాను దర్శకత్వంలో కంఠమనేని రవిశంకర్ నిర్మాతగా రాజధాని ఫైల్స్ చిత్రం తెరకెక్కింది. 

గురువారం రోజు ఈ చిత్రం విడుదల కాగా అర్థాంతరంగా ఏపీలోని థియేటర్స్ లో ప్రదర్శన నిలిపివేసారు. వివాదాస్పదంగా ఈ చిత్రం ఉండడం వల్ల హైకోర్టు ఆదేశాలతో నిలిపివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అధికారులు చెబుతున్నట్లు ఈ చిత్రంలో ఎలాంటి వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయి ? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఎలాంటి సీన్లు చిత్రీకరించారు ? అనే అంశాలు ఇప్పుడు చూద్దాం. 

ఈ చిత్రంలో ముఖ్యమంత్రి జగన్ ని పోలిన పాత్రని విలన్ గా చూపించారు. సోషల్ మీడియాలో అయితే కొన్ని సన్నివేశాలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యని పోలినట్లుగా ఒక సన్నివేశం చూపించారు. ఈ సీన్ లో వివేకానందరెడ్డి పాత్రని బాత్ రూమ్ లోకి తన్ని గొడ్డలితో నరుకుతారు. వెంటనే మన ఛానల్ లో గుండెపోటుతో పోయాడని వేయండ్రా అని చెప్పడం చూడొచ్చు. 

సీఎం జగన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సలహాలతో అధికారంలోకి వచ్చినట్లు చాలా ప్రచారం ఉంది. వైసీపీకి పీకే స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ పాత్ర పీకే చేతిలో కీలు బొమ్మగా మారినట్లు ఈ చిత్రంలో చూపించారు. ఎవరో తెలుగురాని పనికిమాలిన వాడిని నమ్ముకున్నారు కదా సార్ అనే డైలాగులు కూడా ఉన్నాయి. 

సినిమా మొత్తం పీకే జగన్ కి సలహాలు ఇస్తూనే ఉంటారు. అమరావతి రాజధాని విషయంలో వివాదం మొదలైంది కూడా పీకే సలహాతోనే అన్నట్లు గా చూపించారు. చంద్రబాబు అమరావతి రాజధాని ప్రారంభించారు. మీరు దానిని కొనసాగిస్తే మీకు ఎలాంటి పేరు రాదు అని చెప్పడంతో అప్పుడే మూడు రాజధానుల ఐడియా వచ్చినట్లు సినిమాలో చూపించారు. పైగా అమరావతి ప్రాంతంలో ఉన్న భూములు టిడిపి పార్టీవి, వాళ్ళ కులపోళ్ళవే అని చూపించారు. అమరావతి రాజధానిని ఐరావతి అన్నట్లుగా పేరు మార్చి చూపించారు. 

ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎప్పుడు ఎలాంటి స్ట్రాటజీ వేయాలనేది పీకే నిర్ణయం. దానిని అమలు చేయడం మాత్రమే సీఎం పని అన్నట్లుగా చూపించారు. జగన్ అనుచరులుగా ప్రస్తుతం ఉన్న విజయసాయిరెడ్డి, అలాగే మరికొందరు నాయకులని పోలిన పాత్రలు కూడా చూపించారు. జగన్ అనుచరులు అరాచకాలు చేస్తున్నారనే విధంగా రాజధాని ఫైల్స్ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఇలాంటి సన్నివేశాల వల్లే రాజధాని ఫైల్స్ చిత్రాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. 

click me!