కస్తూరి తన వ్యాఖ్యలను సమర్ధించుకుంది.నాకు తమిళనాడు పుట్టినిల్లు అయితే తెలుగు గడ్డ మెట్టినిల్లు లాంటిది. నేను తెలుగువారిని అవమానించలేదు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. ప్రత్యర్థి పొలిటికల్ పార్టీలు నన్ను తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఆమె అన్నారు. ముందస్తు బెయిల్ కి ఆమె అప్లై చేశారు. అయితే కోర్టులో కస్తూరికి చుక్కెదురైంది.
కస్తూరి బెయిల్ పిటిషన్ మదురై హైకోర్టు కొట్టివేసింది. కస్తూరికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్ట్ మధురై బ్రాండ్ జడ్జి ఆనంద్ వెంకటేష్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కస్తూరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కస్తూరి పరారీలో ఉండగా, పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశ పెట్టారు.