`జబర్దస్త్` మాజీ యాంకర్ అనసూయ ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తుంది. అయితే ఈ సారి యాంకర్గా కాదు, కంటెస్టెంట్గా, టీమ్ లీడర్గా చేస్తుంది. `కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షోలో ఆమె లేడీ టీమ్కి లీడర్గా ఉన్నారు. ఇందులో ఆమె చేసిన రచ్చ వైరల్గా మారింది. శేఖర్ మాస్టర్తో పోటీ పడి జాకెట్ విప్పడం దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది బాగా ట్రోల్ కావడంతో అనసూయ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యింది.
ఇక దీంతోపాటు మరో షోలో మెరిసింది అనసూయ. ప్లేబాయ్ ఇమేజ్తో రాణిస్తున్న సుడిగాలి సుధీర్ యాంకర్గా చేస్తున్న `సర్కార్ 4`లో ఆమె లేటెస్ట్ గా పాల్గొన్నారు. ఇందులో అనసూయతోపాటు బాబా భాస్కర్, సింగర్ మనో, మరో సింగర్ గీతా మాధురీ పాల్గొని సందడి చేశారు. కానీ అనసూయ పాల్గొనడం హైలైట్గా నిలిచింది.
ఆమె చాలా అందంగా తయారై రావడంతో సుడిగాలి సుధీర్ కన్ను పడింది. ఓ ప్రశంసల వదిలాడు. ఏంటీ అనసూయ ఇంత అందంగా రెడీ అయి వచ్చావ్ అనగా, నువ్వు యాంకర్ అని తెలియక అంటూ అనసూయ వేసిన పంచ్ అదిరిపోయింది.
అనంతరం బాబా భాస్కర్ మాస్టర్ వచ్చి సుడిగాలి సుధీర్ని ఓ రేంజ్లో ఆడుకున్నాడు. ఆయన ప్లేబాయ్ చేష్టలను బయటపెట్టాడు. ఇక అనసూయ వద్దకు వెళ్లి బాంబ్ పేల్చాడు. ఆమెతో పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. ఈ సృష్టిలో దేవుడు చేసిన స్పెషల్ రెండే రెండు. ఒకటి నువ్వు(అనసూయ), రెండు నేను అంటూ ఆయన చేసిన కామెంట్ హైలైట్గా నిలిచింది. దెబ్బకి అనసూయ ఆనందంతో ఒప్పొంగిపోయింది.
ఇందులో అనసూయ అందంతోనే కాదు, గేమ్తోనూ అందరిని ఆకర్షించింది. అయితే చివర్లో ఆమె ఓ సర్ప్రైజ్ చేసింది. తనలోని కొత్త టాలెంట్ని భయటపెట్టింది. ఇప్పటి వరకు అనసూయని నటిగా అద్భుతమైన నటనని మాత్రమే చూశాం. అలాగే యాంకర్గా ఆమె స్పాంటినిటీ, అందంతో కూడా ఆకర్షణ చూశాం. కానీ మరో టాలెంట్ ఉందని చాటి చెప్పింది.
అనసూయలో సింగర్ ఉన్నారు. ఆ టాలెంట్ని సుధీర్ షోలో బయటపెట్టింది అనసూయ. అద్భుతమైన రొమాంటిక్ మెలోడీ పాటని ఆలపించింది. `నువ్వేనా నా నువ్వే నా` అంటూ ఆమె వినసొంపుగా పాట పాడుతుంటే బాబా భాస్కర్ మాస్టర్, సుధీర్ నోరెళ్లబెట్టి చూడగా, గీతా మాధురి, మనో ఎంజాయ్ చేడం విశేషం. `సర్కార్ 4 `లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.
ఇక అనసూయ ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీగా ఉంది. ఆమె చేతిలో `పుష్ప2`, `సింబా` చిత్రాలున్నాయి. ఓ తమిళ సినిమా ఉంది. ఇవన్నీ పాత కమిట్మెంట్లు. కొత్తగా మరే సినిమా ప్రకటించలేదు. అయితే ఆమెకి అవకాశాలు తగ్గాయనే ప్రచారం జరుగుతుంది. అందుకే బుల్లితెర రీఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు. నిజమేంతో తెలియాల్సి ఉంది.