Janaki Kalaganaledu: మనవడు కావాలంటూ కోరిక కోరిన జ్ఞానాంబ.. జానకి ఐపీఎస్ అటకెక్కినట్టేనా?

Published : Jun 28, 2022, 12:51 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Janaki Kalaganaledu: మనవడు కావాలంటూ కోరిక కోరిన జ్ఞానాంబ.. జానకి ఐపీఎస్ అటకెక్కినట్టేనా?

ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ(jnanamba)తన కోడలి ఇద్దరిని తీసుకొని బారసాల వేడుకకు వెళుతుంది. అక్కడ కామాక్షి అనే ఆమె జానకిని ఏమైనా విశేషం ఉందా అని అడగడంతో జానకి మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు  జ్ఞానాంబ అలాంటిది ఏమీ లేదు అని చెప్పి పాపను ఉయ్యాలలో పడుకోబెడుతుంది. ఆతర్వాత కామాక్షి(kamakshi), జ్ఞానాంబ కోడళ్లకు హారతి పాటలు వస్తాయా అని అనగా వెంటనే మల్లిక తన మాటలతో ఓవర్ చేస్తుంది.

26

అప్పుడు మల్లి(mallika) జానకి ఎలా అయినా అడ్డంగా బుక్ చేయాలి అని తన అక్క పాడుతుంది అనటంతో వెంటనే జానకి లాలి పాట అందరితో ప్రశంసలు అందుకుంటుంది. ఆ తర్వాత వారి ముగ్గురు కలిసి వెళ్తూ ఉండగా అప్పుడు జ్ఞానాంబ జానకి గురించి గొప్పగా చెబుతుంది. ఆ తర్వాత జ్ఞానాం(jnanamba)వాళ్ళు వెళ్తూ ఉండగా కామాక్షి వారిని ఆపి వచ్చే ఏడాది మీ ఇంటికి బారసాల ఫంక్షన్ కు పిలవాలి అంటుంది.

36

అలాగే మీ కోడళ్లలో ఏమైనా లోపం ఉందా అని నానా రకాల మాటలు అని వారిని బాధ పెడుతుంది కామాక్షి.  జ్ఞానాంబ(jnanamba)కావాలని ఇక్కడ మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నావు కదా అని అంటుంది. అంతే కాకుండా మరో నెలలో శుభవార్త చెబుతాను అంటూ తనతో గట్టిగా ఛాలెంజ్ చేస్తుంది. ఇక ఇంటికి వచ్చాక జ్ఞానాంబ మౌనంగా కూర్చొని కామాక్షి (kamakshi)అన్న మాటలను తలుచుకుంటూ ఉంటుంది.
 

46

అప్పుడు గోవిందరాజులు(govindarajulu)ఏం జరిగింది అని తన కోడళ్లను అడగడంతో వెంటనే జానకి అక్కడ జరిగిన విషయం చెబుతుంది. ఇక గోవిందరాజులు కూడా మీ అత్తయ్య ఈ విషయం గురించి ఎప్పటినుంచో బాధ పడుతుంది అని అంటాడు.  ఇక జానకి(janaki) తన అత్తయ్య ని చూసి బాధపడుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత జ్ఞానాంబ ఒక నిర్ణయం తీసుకుంటుంది. చికితని పిలిపించి తన ఇద్దరు కోడళ్లను పిలువమని చెబుతుంది.
 

56

దాంతో జానకి వెంటనే రాగా మల్లిక(mallika) మాత్రం అక్కడ జరిగిన విషయాన్ని తలచుకొని బాగా తింటూ ఎంజాయ్ చేస్తుంది.అప్పుడు మల్లిక చికిత పిలవడంతో రాకుండా ఓవర్ చేస్తుంది. ఆ తర్వాత జ్ఞానాంబ(jnanamba)గట్టిగా పిలవటంతో బయటకు ఏం తెలియనట్టుగా వస్తుంది. ఇక జ్ఞానంబ తన ఇద్దరు కోడళ్ళతో తన మనసులో ఉన్న బాధను చెబుతుంది.
 

66

 ఇక అప్పుడే గోవిందరాజుల(govindarajulu)తో పాటు తన ఇద్దరు కొడుకులు కూడా వచ్చి జ్ఞానంబ మాటలు వింటారు. జ్ఞానాంబ తన ఇద్దరు కోడళ్లకు తనకు మనవడిని అయినా మనవరాలని అయినా ఇవ్వమని అంటుంది. అంతేకాకుండా మాట ఇవ్వమని అడగటంతో జానకి అలాగే నుంచుంటుంది. అక్కడే ఉన్న రామ(rama chandra)ముఖం చూస్తూ ఉంటుంది. జ్ఞానాంబ జానకి తో ఇతరుల మనసులో ఉన్న బాధలను అర్థం చేసుకుంటావు మరి నా బాధను అర్థం చేసుకోవా అని అడుగుతుంది.

click me!

Recommended Stories