జాన్వీ కపూర్ పై శ్రీదేవి అభిమానుల అసహనం.! ఎందుకంటే?

First Published Jun 28, 2022, 12:34 PM IST

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి (Sri Devi)ని అభిమానించే వారి సంఖ్య కోట్లల్లోనే ఉంటుంది. అయితే ఆమె అభిమానులు తాజాగా కూతురు జాన్వీ కపూర్ విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.. అసలు విషయం ఏంటంటే..
 

వందలాది చిత్రాల్లో దాదాపు అలనాటి సీనియర్ హీరోలందరి సరసన నటించిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించిన ఈమె ఇటు సౌత్, అటు నార్త్ ఆడియెన్స్ కు ఎన్నటికీ మరిచిపోలేనంత గా దగ్గరైంది. తన అందం, అభినయంతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.  
 

ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న శ్రీదేవి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి భారత చలన చిత్ర పరిశ్రమలో ఆణిముత్యంగా మిగిలిపోయింది. 1996లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor)ను వివాహాం చేసుకుంది. ఆ సమయంలో సినిమాలకు దూరమైన ఆమె ఇద్దరు కూతుర్లు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషీ కపూర్ కు జన్మనిచ్చింది.
 

పద్మశ్రీ అవార్డు అందుకున్న అందాల సుందరి 2018లో ప్రమాదవ శాత్తు మరణించిన విషయం తెలిసిందే. ఆమె చనిపోయినప్పుడు అభిమానులు ఎంతగానో చింతించారు. ఇప్పటికీ ఆమె లేదనే చేధు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే శ్రీదేవిని అంతలా ఆదరించే అభిమానులు.. ఆమెను కూతురు జాన్వీ కపూర్ లో చూసుకుంటున్నారు. 
 

కానీ జాన్వీ కపూర్ మాత్రం బోల్డ్ ఫొటోషూట్లు చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. గ్లామర్ షోలో, హాట్ నెస్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో శ్రీదేవితో సమానంగా జాన్వీని చూసుకుంటున్న అభిమానులు కాస్తా అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ఆమె ప్రవర్తన, వ్యవహరిస్తున్న తీరు అసలేం బాలేవంటూ కాస్తా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట.
 

ఇకనైనా దివంగత శ్రీదేవి బాటలో పయనించాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. జాన్వీకి బోలెడంతా టాలెంట్ ఉందని, పైగా తల్లి పోలికలు దగ్గరగా ఉండటం మరింత శుభపరిణామన్నారు. సరైన విధంగా వెళ్లితే జాన్వీ తన తల్లిలాగే  మంచి గుర్తింపు పొందుతుందని  భావిస్తున్నారు.  

జాన్వీ కపూర్ హిందీలో వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. రోటీన్ కు భిన్నంగా కథలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం తను నటించిన చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ మూవీ జులై 29న విడుదల కానుంది. ఇక  తన చెల్లి ఖుషీ కపూర్ కూడా ఇటీవల ‘ది ఆర్చీస్’ మూవీలో నటించింది. 

click me!