singer pravasthi aradhya (Rtv)
Singer Pravasthi Aradhya: ఈటీవీలో ప్రసారమయ్యే `పాడుతా తీయగా` ప్రోగ్రామ్పై సింగర్ ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారుతున్నాయి. తనకు అన్యాయం చేశారని, హేళనగా చూశారని, బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారని,
తనని కావాలనే ఎలిమినేట్ చేశారని ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు అందరికి షాకిస్తున్నాయి. అంతేకాదు ఏకంగా జడ్జ్ లుగా ఉన్న కీరవాణి, చంద్రబోస్, సునీతలపై ఆమె షాకింగ్ అలిగేషన్ చేసింది.
singer pravasthi aradhya (RTV)
ఈ మేరకు సింగర్ ప్రవస్తి ఓ వీడియోని తన యూట్యూబ్ ఛానెల్లో పంచుకుంది. పాడుతా తీయగా షోలో తెరవెనుక ఏం జరుగుతుందో బాగోతం మొత్తం బయటపెట్టింది. తనకు అనుకూలమైన వారిని విన్నర్ని చేసి నచ్చని వారిని ఎలా ఎలిమినేట్ చేస్తారో తెలిపింది ప్రవస్తి.
సునీతపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. తనంటే ఆమెకి నచ్చదని, కావాలని పాయింట్ తీసి తప్పులు వెతుకుతుందని చెప్పింది. తన బాడీ గురించి తప్పుగా మాట్లాడిందని తెలిపింది.
Padutha Theeyaga
ఈ క్రమంలో మరో షాకింగ్ కామెంట్స్ చేసింది. గిఫ్ట్స్ ఇస్తే ఫేవర్గా జడ్జ్ మెంట్ ఇస్తారంటూ మరో బాంబ్ పేల్చింది. మనీ మ్యాటర్ ప్రస్తావనకు తెచ్చిన ఆమె ఈ పోటీలో భాగంగా జడ్జ్ లు సింగర్స్ తో క్వచ్చన్స్ అడిగే రౌండ్ ఒకటి ఉంటుందట.
ఆ సమయంలో కొందరు సింగర్స్ జడ్జ్ లకు గిఫ్ట్ ఇస్తుంటారని, అలా ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చిన వారికి జడ్జ్ మెంట్ కాస్త ఫేవర్గా ఉంటుందని ఆమె కామెంట్ చేయడం షాకిస్తుంది. `ఆర్టీవీ`లో మాట్లాడుతూ సింగర్ ప్రవస్తి ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.
అయితే ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. జడ్జ్ లు ఇలా పర్సనల్గా టార్గెట్ చేయడమనేది ఉంటుందని తాను అనుకోవడం లేదని, కానీ ప్రొడక్షన్ కంపెనీనే ఇవన్నీ చేయిస్తుందని తెలిపింది. జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్లు దీన్ని నిర్వర్తిస్తుంటారని, ఆ ప్రొడక్షన్ వాళ్లే ఇవన్నీ చేస్తారని, జడ్జ్ ల చేత చేయిస్తారని తెలిపింది.
`పాడుతా తీయగా` కార్యక్రమంలో కూడా అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని చెప్పడం షాకిస్తుంది. కీరవాణి, సునీత, చంద్రబోస్ తమతో అలా మాట్లాడటానికి కారణం ప్రొడక్షన్ హౌజ్ వాళ్లే అని తెలపడం గమనార్హం.