ఈరోజు దివంగత ఘట్టమనేని ఇందిరా దేవి దశదిన కర్మను కృష్ణ గారి ఇంట్లో నిర్వహించారు. పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఇందిరా దేవికి చిత్రపటానికి కృష్ణ, మహేశ్ బాబు, నమ్రతా, కుటుంబ సభ్యులంతా పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. చివరి కార్యక్రమాల్లో భాగంగా మహేశ్ బాబు తల్లి చిత్రపటానికి నమస్కరిస్తూ భావోద్వేగితుడయ్యాడు.