టాప్‌ షోతో రెచ్చిపోయిన సీనియర్‌ హీరోయిన్‌.. పార్టీ కోసం యమ హాట్‌గా పోజులు.. ఏదేమైనా తగ్గేదెలే!

First Published May 27, 2022, 6:01 PM IST

టాలీవుడ్‌లో క్యూట్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న జెనీలియా.. పెళ్లి తర్వాత మాత్రం యమ హాట్‌ అని నిరూపించుకుంటుంది. లేటెస్ట్ గా ఆమె అభిమానులతో పంచుకున్న ఫోటోలే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. 
 

దాదాపు పదేళ్లపాటు టాలీవుడ్‌ని ఊపేసిన జెనీలియా(Genelia) ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. హిందీ, తెలుగులోనూ సినిమాలు చేస్తుంది. సినిమాలు చేయడమేకాదు, గ్లామర్‌ పరంగానూ రెచ్చిపోతుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో యంగ్‌ హీరోయిన్లతో పోటీ పడుతుంది. సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

లేటెస్ట్ గా మరోసారి రెచ్చిపోయింది జెనీలియా. కరణ్‌ జోహార్‌ బర్త్ డే పార్టీ బుధవారం రాత్రి జరిగిన నేపథ్యంలో ఆ ఈవెంట్‌కి యమ హాట్‌గా ముస్తాబైంది జెనీలియా. నెక్‌ లెస్‌ గౌన్‌లో క్లీవేజ్‌ అందాల షోతో రెచ్చిపోయింది. ఈ సందర్భంగా ఆమె చేసిన స్పెషల్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో జెనీలియా అందాలు ఘాటు రేపుతున్నాయి. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. ఏదేమైనా తగ్గేదెలే అంటోంది జెనీలియా.

ఈ సందర్భంగా జెనీలియా చెబుతూ, జీవితాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, దాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలి. సరిగ్గా కరణ్‌ జోహార్‌ యాభైవ పుట్టిన రోజున అదే జరిగింది. నీ లైఫ్‌ సెలబ్రేషన్‌లో మమ్మల్ని భాగం చేసిన కరణ్‌కి ధన్యవాదాలు. నేను ఇంత డాన్సు ఎప్పుడు చేశానో గుర్తే లేదు. అంతగా డాన్స్ చేశాను` అని పేర్కొంది జెనీలియా. కరణ్‌ జోహార్‌ బర్త్ డే బాష్‌లో జెనీలియా రెచ్చిపోయిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ పార్టీకి బాలీవుడ్‌ సెలబ్రిటీలంతా పాల్గొన్న విషయం తెలిసిందే. తెలుగుకి చెందిన రకుల్‌, పూజా హెగ్డే, రష్మిక, విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌, చార్మి పాల్గొన్నారు.

జెనీలియా దశాబ్దం క్రితం టాలీవుడ్‌ని ఊపేసింది. ఆల్మోస్ట్ అందరు యంగ్‌, స్టార్‌ హీరోలను ఓ చుట్టేసింది. అల్లరి, చిలిపిగా కనిపిస్తూ కనువిందు చేస్తూ వెండితెరపై మ్యాజిక్‌ చేసింది జెనీలియా. అలానే తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. `బొమ్మరిల్లు` హీరోయిన్‌గా పాపులారిటీ పొందిన జెనీలియా. 
 

ఆమె సినిమాలు మానేసి చాలా కాలమే అవుతుంది. 2012లో వచ్చిన `నా ఇష్టం` సినిమాతో సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది.మ్యారేజ్‌ కావడంతో సినిమాలకు దూరంగా ఉంది. మధ్యమధ్యలో గెస్ట్ రోల్స్ లో మెరిసిన జెనీలియా ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం `ఇట్స్ మై లైఫ్‌` అనే చిత్రంలో నటించింది. 

ఇప్పుడు సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. గాలి జనార్థన్‌ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. ఇందులో కీలక పాత్రతో జెనీలియా రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ చిత్రాన్ని కన్నడతోపాటు తెలుగులోనూ రూపొందిస్తున్నారు. దీంతోపాటు రామ్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. వీరిద్దరు కలిసి `రెడీ`లో నటించిన విషయం తెలిసిందే. 

అలాగే `మిస్టర్‌ మమ్మి` అనే హిందీ చిత్రంలో, అలాగే `వెడ్‌` అనే మరాఠి చిత్రంలో నటిస్తుంది జెనీలియా. కీలక పాత్రలతో హిందీతోపాటు తెలుగు, సౌత్‌ ఆడియెన్స్ ని అలరించేందుకు రెడీ అవుతుంది. టాలీవుడ్‌ పాన్‌ ఇండియా రేంజ్‌కి ఎదిగిన నేపథ్యంలో తెలుగుపై బాగా దృష్టి పెట్టిందని టాక్. మరి రీఎంట్రీ తర్వాత ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో, ఆమెని ఆడియెన్స్ ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి. 

click me!