Gautam as Hero: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు వచ్చాడు. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నారు. భవిష్యత్లో ఆయన తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అలాగే మహేష్ బాబు వారసుడిగా గౌతమ్ ఘట్టమనేని కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అటు నమ్రత, ఇటు మహేష్ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే గౌతమ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే బాలనటుడిగా గౌతమ్ ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు హీరోగా రూపొందిన `వన్ నేనొక్కడినే` చిత్రంలో బాలనటుడిగా గౌతమ్ పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇందులో చిన్నప్పటి మహేష్ గా గౌతమ్ కనిపించి అలరించారు. కానీ సినిమా ఆడలేదు. దీంతో మళ్లీ సినిమాల వైపు చూడలేదు గౌతమ్.
ఇదిలా ఉంటే గౌతమ్ మెయిన్ లీడ్గానే సినిమాకి ప్లాన్ జరిగిందట. దర్శకుడు జయంత్ సి పరాంజీ ఈ ప్లాన్ చేశాడు. రైటర్ తోట ప్రసాద్ కథ రాశారట. మంచి కథతో గౌతమ్ మెయిన్ లీడ్గా పెట్టి, మహేష్బాబు, కృష్ణలు కూడా ఆ సినిమాలో ఉండేలా జయంత్, తోట ప్రసాద్ ప్లాన్ చేశారట.
ఇది మహేష్ బాబు, కృష్ణల వద్దకు కూడా వెళ్లింది. చర్చలు కూడా జరిగాయి, కానీ ఆ మూవీ సెట్ కాలేదన్నారు రైటర్ తోట ప్రసాద్. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే ఈ ప్లాన్ జరిగింది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ పది పదిహేనేళ్ల క్రితం కావడం విశేషం. జయంత్కి మహేష్ బాబు చాలా క్లోజ్ కావడంతో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో ఆ మూవీ వర్కౌట్ కాలేదట. కానీ అప్పుడు వర్కౌట్ అయితే నిజంగానే ఘట్టమనేని ఫ్యామిలీలో గొప్ప చిత్రంగా మిగిలిపోయేది. సూపర్ స్టార్ ఫ్యామిలీ అంతా కలిసి నటించిన మూవీగా నిలిచిపోయేది.
గౌతమ్ ప్రస్తుతం స్టడీస్ పై ఫోకస్ పెట్టాడు. ఆయన హీరోగా ఎంట్రీకి ఇంకా మూడునాలుగేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఎస్ఎస్ఎంబీ29` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన వీడియో సంచలనం సృష్టించింది. సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
read more: ఈ ఒక్క రోజు కోసం 25ఏళ్లు నరకం చూశా, శివాజీ ఎమోషనల్
also read: థియేటర్లో పునీత్ రాజ్కుమార్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న `ఇడియట్` హీరోయిన్.. ఎమోషనల్ కామెంట్