బడ్జెట్ పెరగడానికి పారితోషికాలు పెరగడమే ఓ కారణంగా చెప్పొచ్చు. రెండో పార్ట్ కి ఫహద్ సుమారు ఎనిమిది కోట్ల వరకు తీసుకున్నారని సమాచారం. అన్ని కటింగ్స్ పోతే ఆయనకు 7.2కోట్లు వరకు ముట్టిందని సమాచారం. పలువురు క్రిటిక్స్ సైతం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఫహద్ కి ఆ పారితోషికం తక్కువేం కాదు, కానీ హీరోయిన్ కంటే తక్కువగా ఉండటం ఆశ్చర్యంగా మారింది.
ఇందులో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తుంది. శ్రీవల్లిగా ఆమె మరోసారి రచ్చ చేసేందుకు వస్తుంది. అయితే ఈ రెండో పార్ట్ కిగానూ రష్మికకి పది కోట్లు పారితోషికం ఇస్తున్నారట. ఇదే నిజమైతే హీరోయిన్ కంటే ఫహద్ తక్కువ పారితోషికమే తీసుకుంటున్నారని చెప్పొచ్చు.